డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినందుకు.. | Family Members Alleges Women Due To Negligence Of Government Hospital | Sakshi
Sakshi News home page

డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినందుకు..

Jul 9 2018 12:22 PM | Updated on Jul 9 2018 1:04 PM

Family Members Alleges Women Due To Negligence Of Government Hospital - Sakshi

సాక్షి, చిత్తూరు : ఎన్ని ప్రాణాలు పోతున్నా ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది తీరు మాత్రం మారడం లేదు. తాజాగా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలైంది. వివరాలు.. పుత్తూరు పట్టణం ఆచారి వీధికి చెందిన నిఖిలను డెలివరీ కోసం శనివారం పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ప్రసవం అనంతరం అధిక రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో ఆదివారం రాత్రి ఆమె మరణించింది. ప్రసవానంతరం సరైన చికిత్స చేయకుండా నిఖిల మరణానికి కారణమయ్యారంటూ ఆస్పత్రి సిబ్బందిపై మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి తీరుకు నిరసనగా రోడ్డుపై ధర్నాకు దిగి ఆందోళన చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement