తాకట్టులో అమ్మవారి మంగళసూత్రం | durga mangalsutra is  hostage | Sakshi
Sakshi News home page

తాకట్టులో అమ్మవారి మంగళసూత్రం

Oct 29 2017 3:34 PM | Updated on Oct 29 2017 7:22 PM

durga mangalsutra is  hostage

విజయవాడ: ప్రఖ్యాత ఇంద్రకీలాద్రి శ్రీ కనక దుర్గ ఆలయానికి ఉపాలయంగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడిలో అపచారం చోటుచేసుకుంది. ఆలయంలోని శ్రీవల్లి అమ్మవారి మంగళసూత్రం మూడు నెలల కిందట హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఆలయంలోని ఓ అర్చకుడు అమ్మవారి బంగారు తాళిబొట్టును తాకట్టు పెట్టి సొమ్ముచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు ఈ అంశం వివాదాస్పదంగా మారకముందే గుట్టుచప్పుడు కాకుండా తాకట్టు నుంచి మంగళసూత్రాలను విడిపించినట్లు సమాచారం.

అయితే సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని కొందరు సిబ్బంది ఈ విషయాన్ని బయటపెట్టడంతో మొత్తం వ్యవహారం వెలుగు చూసింది. మరోవైపు ఈ అంశం తన దృష్టికి రాలేదని ఆలయ ఈఓ సూర్యకుమారి చెబుతున్నారు. అ సంఘటనపై విచారణ జరుపుతామని చెబుతున్నారు. ఇప్పటికే దుర్గ గుడిలో అధికారుల తీరు పలు వివాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో తాళిబొట్టు మాయమైన అంశం మరో వివాదంగా మారుతుందనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement