నర్సీపట్నంలో వెంకటలక్ష్మి ఆమరణదీక్ష భగ్నం | Disruption of Venkata Lakshmi Hunger strike | Sakshi
Sakshi News home page

నర్సీపట్నంలో వెంకటలక్ష్మి ఆమరణదీక్ష భగ్నం

Aug 27 2013 3:47 PM | Updated on Sep 1 2017 10:10 PM

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో వైఎస్ఆర్ సిపి విశాఖ రూరల్ మహిళా కన్వీనర్ పీలా వెంకటలక్ష్మి ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. Disruption of Venkata Lakshmi Hunger strike

నర్సీపట్నం: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో  వైఎస్ఆర్ సిపి విశాఖ రూరల్ మహిళా కన్వీనర్  పీలా వెంకటలక్ష్మి ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమెను నర్సీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చేస్తున్న దీక్షకు మద్దతుగా   వెంకటలక్ష్మి ఆదివారం  ఆమరణ దీక్ష చేపట్టింది.

 అప్పటి వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన పార్టీ నేతలు, కార్యకర్తలు  జగన్ జైలులో దీక్ష చేపట్టిన తరువాత  ఉద్యమాన్ని ఉధృతం చేశారు.  జననేత జగన్కు జిల్లా వ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రాణత్యాగానికైనా సిద్ధమంటున్నారు. నర్సీపట్నంలో పార్టీ నాయకులు పీలా వెంకటలక్ష్మి, బేతిరెడ్డి విజయ్‌కుమార్, ఎం.డి.బాషాలు ఆదివారం నుంచి ఆమరణ దీక్షలు చేపట్టారు. వారి దీక్షలను పోలీసులు ఈ రోజు భగ్నం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement