సోమవారం నుంచే బిల్లుపై అసెంబ్లీలో చర్చ | discussion on Telangana Bill in assembly from Monday, says Gandra venkataramana reddy | Sakshi
Sakshi News home page

సోమవారం నుంచే బిల్లుపై అసెంబ్లీలో చర్చ

Dec 14 2013 12:46 PM | Updated on Sep 27 2018 5:59 PM

సోమవారం నుంచే బిల్లుపై అసెంబ్లీలో చర్చ - Sakshi

సోమవారం నుంచే బిల్లుపై అసెంబ్లీలో చర్చ

తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో సోమవారం నుంచే ప్రారంభం అవుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు.

హైదరాబాద్ : తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో సోమవారం నుంచే  ప్రారంభం అవుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. బిల్లు ప్రతులను తెలుగులోకి అనువదించటం సమస్య కాదని ఆయన శనివారమిక్కడ అన్నారు. సోమవారమే బిల్లు ప్రతులను సభ్యులందరికీ ఇస్తామన్నారు. బిల్లును సభలో చర్చించి వీలైనంత త్వరగా రాష్ట్రపతికి పంపడమే తమ అజెండా అన్నారు. చంద్రబాబు నాయుడు బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని గండ్ర సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement