గడువు పొడిగింపుపై రాత్రికి లేక రేపు నిర్ణయం | Damodara Rajanarasimha talks with Mahanti on Extension to the deadline | Sakshi
Sakshi News home page

గడువు పొడిగింపుపై రాత్రికి లేక రేపు నిర్ణయం

Jan 22 2014 5:17 PM | Updated on Sep 27 2018 8:33 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు(తెలంగాణ బిల్లు)పై శాసనసభలో చర్చకు గడువు పొడించే విషయంపై ఈ రాత్రికి గాని లేక రేపు ఉదయం గానీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు(తెలంగాణ బిల్లు)పై శాసనసభలో చర్చకు గడువు పొడించే విషయంపై ఈ రాత్రికి గాని లేక రేపు ఉదయం గానీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయమై ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (సీఎస్) పి.కె.మహంతితో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఫోన్లో మాట్లాడారు. గడువు పెంపు విషయమై ఆరా తీశారు. ఈ రాత్రికి గాని రేపు గాని నిర్ణయం వెలువడే అవకాశం ఉందని మహంతి ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది.

చర్చకు మరో నెల రోజులు గడువు పొడగించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (సీఎస్) పి.కె.మహంతి కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. ఆ లేఖను హొం శాఖ రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి న్యాయసలహా కోరినట్లు హోంశాఖ వర్గాల సమాచారం.

ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ కార్యదర్శి శివశంకర్  గడువు పెంపుపై కేంద్ర హోంశాఖ అధికారులను కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement