జలుమూరు: పాడు నిద్ర ప్రాణం తీసింది. రోజంతా కష్టపడి రాత్రి వేళ నిద్రపోతున్న వ్యక్తి పైనుంచి టిప్పర్ దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన వంవధార నది కరకట్టల నిర్మాణా పనుల్లో భాగంగా కొమనాపల్లి సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన చీడి రమణ(35) ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరకట్టల పనుల్లో భాగంగా రమణ తనకున్న బుల్డోజర్తో మట్టిని సరిచేసే పనుల్లో మంగళవారం సాయంత్రం వరకూ పాల్గొన్నాడు. రాత్రికి కరకట్టల గట్టు మీదే పడుకొన్నాడు.
ఇదే సమయంలో గట్టుకు మట్టి వేసే పనిలో భాగంగా మాకీయవలసకు చెందిన టిప్పర్ డ్రైవర్ మంత్రి దాలయ్య వెనుక నుంచి మట్టి వేస్తూ వాహనంతో రమణను గమనించకుండా అతని పైనుంచి వెళ్లిపోయాడు. దీంతో రమణ శరీరం నుజ్జునుజ్జు అయి..అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కొంతమంది మాట్లాడుతూ కరకట్టల నిర్మాణ పనులు చేసే వారంతా ఎప్పుడు గట్టుపైనే నిద్రిస్తారన్నారు. మంగళవారం రాత్రి కూడా శ్రీముఖలింగం గ్రామానికి చెందిన చింతం రాంబాబు, చీడి రమణ ఒకే చోట పడుకున్నారని చెప్పారు. అయితే వాహనం వస్తున్న శబ్దానికి తెలివి తెచ్చుకొని రాంబాబు పక్కకు వెళ్లగా రమణపై నుంచి టిప్పర్ వెళ్లిపోయినట్టు తెలిపారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే నా భర్త మరణానికి కారణం!
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే నా భర్త మరణించాడని రమణ భార్య సరోజిని రోదిస్తూ చెప్పింది. బుల్డోజర్ అద్దెతోపాటు పని చేసినందుకు వేతనం కూడా మూడు నెలలుగా చెల్లించలేదని వాపోయింది. ఎప్పుడు ఫోన్ చేసినా కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తే ఇంటికి వస్తానని తన భర్త చెప్పేవాడని..ఇంతలోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడని విలపించింది. ఇంత ప్రమాదం జరిగినా సంబంధిత కాంట్రాక్టర్ పత్తా లేకుండా పోయాడని మృతుని బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్ వస్తే గాని రమణ మృతదేహన్ని తీసుకెళ్లమని తేల్చి చెప్పి గొడవకు దిగారు. దీంతో పోలీసులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. విగత జీవిగా పడి ఉన్న తండ్రి మృతదేహాన్ని చూసిన రమణ కొడుకు మణికంఠ, కూతురు హేమలతాలు కన్నీరుమున్నీరయ్యారు. సరోజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ డి.విజయ్కుమార్ తెలిపారు.
పాడు నిద్ర ప్రాణం తీసింది
Published Thu, Jun 18 2015 1:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
వివాహితపై అత్తింటివారి దాడి
Lok sabha elections 2024: లాలూ వర్సెస్ రోహిణి!
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక
వేడుకునేది ఓటర్ని కాదు! సూర్యుడ్ని!!
సాంఘిక విప్లవ నాయకుడు
Association for Democratic Reforms: మూడో విడతలో... మహిళలు 9 శాతమే
ఆనందంతో డైరెక్టర్ని హత్తుకున్నాను: సుహాస్
జాలీ రైడ్
తప్పక చదవండి
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
Advertisement