కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్యాయత్నం | couple suicide for Family strife | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్యాయత్నం

Apr 30 2015 9:52 PM | Updated on Jul 10 2019 8:00 PM

కుటుంబ కలహాలతో దంపతులు శనగమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కొయ్యలకుంట(వైఎస్సార్ జిల్లా): కుటుంబ కలహాలతో దంపతులు శనగమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన గురువారం వైఎస్సార్ జిల్లా కొయ్యలకుంట మండలం అంకంపల్లె గ్రామంలో జరిగింది. వివరాలు.. అంకంపల్లె గ్రామానికి చెందిన వెంకటేష్, కల్యాణి దంపతులు గత కొంత కాలంగా కుటుంబకలహాలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఇంటిలో ఉన్న శనగమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలిసిన స్థానికులు దంపతులను మెరుగైన వైద్యం కోసం కడప ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతానికి దంపతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement