ఏపీలో 190కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు | Coronavirus : Another 10 Positive Cases In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో 190కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

Apr 4 2020 6:31 PM | Updated on Apr 4 2020 7:18 PM

Coronavirus : Another 10 Positive Cases In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శనివారం ఉదయం 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా తాజాగా మరో 10 కేసులు కరోనా పాజిటివ్‌గా తేలాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 190కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కొత్తగా కృష్ణా జిల్లాలో 5, గుంటూరులో 3, ప్రకాశం, అనంతపురం జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. జిల్లాల వారిగా నెల్లూరు, కృష్ణాలో అత్యధికంగా 32, గుంటూరు 26, వైఎస్సార్‌ కడప 23, ప్రకాశం 19, పశ్చిమ గోదావరి 15, విశాఖపట్నం 15, చిత్తూరు 10, తూర్పు గోదావరి 11, కర్నూలు 4, అనంతపురంలో 3 పాటిజివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఏపీలో కరోనా మృతుల సంఖ్య రెండుకి చేరింది. శుక్రవారం నాడు విజయవాడలో తొలి కరోనా మృతి నమోదు కాగా.. శనివారం ఉదయం హిందూపూర్‌కు చెందిన కరోనా బాధితుడు మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement