మలికిపురం: రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో రోజూ చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికపై మేడిద రాంబాబు(45) లైంగిక దాడికి పాల్పడినట్లు ఎస్ఐ పి.వి.వి సురేష్ శనివారం తెలిపారు.
బాలిక తల్లిదండ్రులు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బాలిక ఇంటి వద్దకు తరచూ వచ్చే రాంబాబు శుక్రవారం కూడా ఇంటికి వచ్చాడు. రాంబాబు బాలికను ఇంటి పక్కకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడుతుండగా బాలిక నానమ్మ చూసి కేకలు వేసింది. దీంతో రాంబాబు పరారయ్యాడు.


