ఆ ఎమ్మెల్యే రూటే సెపరేటు | Congress MLA Kamala put empty ballot paper | Sakshi
Sakshi News home page

ఆ ఎమ్మెల్యే రూటే సెపరేటు

Feb 7 2014 12:53 PM | Updated on Mar 18 2019 8:57 PM

ఆ ఎమ్మెల్యే రూటే సెపరేటు - Sakshi

ఆ ఎమ్మెల్యే రూటే సెపరేటు

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు విభిన్న పంథా అనుసరించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరస్కరణ ఓటును వినియోగించుకోగా, గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే కొండ్రు కమల

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు విభిన్న పంథా అనుసరించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరస్కరణ ఓటును వినియోగించుకోగా, గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే కె.  కమల ఖాలీ బ్యాలెట్ పేపర్ను బాక్స్లో వేశారు. ఓటింగ్కు హాజరైన కమల ఏ అభ్యర్థికీ ఓటు వేయలేదు. తిరస్కరణ ఓటు అవకాశాన్ని కూడా వినియోగించుకోలేదు. బ్యాలెట్ పేపర్ను యధాతథంగా బాక్స్లో వేశారు. మరో ఎమ్యెల్యే దగ్గుబాటి మాత్రం.. పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థుల విధానం తనకు నచ్చనందునే ఓటు వేయలేదని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలిపానన్నారు. విభజనలో సీమాంధ్రకు అన్యాయం జరిగిందని అందుకే తిరస్కరణ ఓటు వేసినట్లు చెప్పారు.

మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తొలి ఓటును వేశారు. కాగా ఓటింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం దూరంగా ఉన్నాయి. ఇక కేవీపీ రామచంద్రరావు, టి. సుబ్బరామిరెడ్డి, ఎంఏ ఖాన్ (కాంగ్రెస్), గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి (టీడీపీ), కే కేశవరావు (టీఆర్‌ఎస్) రాజ్యసభ బరిలో ఉన్న విషయం తెలిసిందే. సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్ జరగనుంది. పోటీ నుంచి ఆదాల వైదొలగడంతో వీరి ఎన్నిక లాంఛనం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement