అల్లూరి, పింగళికి సీఎం వైఎస్‌ జగన్‌ నివాళి | Sakshi
Sakshi News home page

అల్లూరి త్యాగం తెలుగు జాతికే గొప్ప గౌరవం

Published Sat, Jul 4 2020 5:13 PM

CM YS Jagan Tribute To Alluri And Pingali Venkayya - Sakshi

సాక్షి,అమరావతి: జాతీయ పతాక రూపశిల్పి, స్వాతంత్ర్య పోరాట యోధుడు పింగళి వెంకయ్య వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ‘మన జాతీయ పతాక రూపశిల్పి.. స్వాతంత్ర్య పోరాట యోధుడు పింగళి వెంకయ్యగారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్యగారు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. (చెరకు రైతుల బకాయిలు తీర్చాలి)

అలాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా సీఎం జగన్‌ నివాళులర్పించారు. ‘గిరిజనుల హక్కుల కోసం పోరాడి, వారిలో స్వాతంత్ర్య ఉద్యమస్ఫూర్తిని రగిల్చి.. దేశం కోసం సాయుధ తిరుగుబాటు చేసిన యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు. అల్లూరి త్యాగం తెలుగు జాతికే గొప్ప గౌరవం’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement