వాటర్‌గ్రిడ్‌తో నీటి సమస్యలకు చెక్‌ 

CM YS Jagan review with authorities on Pulivendula constituency development - Sakshi

పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష

పులివెందుల: రాష్ట్రవ్యాప్తంగా వాటర్‌గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. దీంతో సాగు, తాగునీటి సమస్యలు తీరతాయని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నియోజకవర్గ అభివృద్ధి పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పులివెందులను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ప్రతి మండలంలో గోడౌన్లు, నియోజకవర్గాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు.

అనంతరం సీఎం సహాయ నిధి కింద 9 మందికి మంజూరైన రూ.20 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌–2019లో కడపకు చెందిన ఆర్‌.కె.సిద్ధార్థ రెడ్డి, పి.వి.సాయిశ్రీనివాస్‌లు బంగారు పతకాలు సాధించిన సందర్భంగా వారిని అభినందించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top