చిన్నారి వైద్యం కోసం వినతి | Child Suffering With thalassemia In Chittoor | Sakshi
Sakshi News home page

చిన్నారి వైద్యం కోసం వినతి

Aug 1 2018 11:26 AM | Updated on Aug 1 2018 11:26 AM

Child Suffering With thalassemia In Chittoor - Sakshi

ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇస్తున్న అమిలేపల్లె గ్రామస్తులు

వాల్మీకిపురం: చిన్నారి మహ్మద్‌ అమాన్‌బాషా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని, వైద్యానికి రూ.13 లక్షలు కావాలని వైద్యులు చెప్పారని, తమ వద్ద డబ్బులు లేవని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని కలసి విన్నవించారు. గుర్రంకొండ మండలం, అమిలేపల్లికు చెందిన షఫీ కుమారుడు మహ్మద్‌ అమాన్‌బాషా (5) పుట్టిన ఆరునెలల నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడని, 15 రోజులకు ఒకసారి బెంగళూరు రక్తమార్పిడి చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్నదంతా వైద్యానికి ఖర్చుచేశారని, ప్రస్తుతం బిడ్డను కాపాడుకునే స్థితిలో లేరని, దయ చూపాలని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే బెంగళూరులోని వైదేహి ఆస్పత్రి గుండె వైద్యనిపుణులు డాక్టర్‌ దుర్గాప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దయతో ఆ కుటుంబానికి సాయం చేయాలని కోరారు. దాతల సహకారంతో శస్త్రచికిత్స చేయించే విధంగా చూస్తామని డాక్టర్‌ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషంతో వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement