చిన్నారి వైద్యం కోసం వినతి

Child Suffering With thalassemia In Chittoor - Sakshi

వాల్మీకిపురం: చిన్నారి మహ్మద్‌ అమాన్‌బాషా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని, వైద్యానికి రూ.13 లక్షలు కావాలని వైద్యులు చెప్పారని, తమ వద్ద డబ్బులు లేవని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని కలసి విన్నవించారు. గుర్రంకొండ మండలం, అమిలేపల్లికు చెందిన షఫీ కుమారుడు మహ్మద్‌ అమాన్‌బాషా (5) పుట్టిన ఆరునెలల నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడని, 15 రోజులకు ఒకసారి బెంగళూరు రక్తమార్పిడి చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్నదంతా వైద్యానికి ఖర్చుచేశారని, ప్రస్తుతం బిడ్డను కాపాడుకునే స్థితిలో లేరని, దయ చూపాలని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే బెంగళూరులోని వైదేహి ఆస్పత్రి గుండె వైద్యనిపుణులు డాక్టర్‌ దుర్గాప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దయతో ఆ కుటుంబానికి సాయం చేయాలని కోరారు. దాతల సహకారంతో శస్త్రచికిత్స చేయించే విధంగా చూస్తామని డాక్టర్‌ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషంతో వెనుదిరిగారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top