కిలో చికెన్ రూ.200-220
రికార్డు స్థాయిలో ధర
రోజురోజుకు పెరుగుతున్న వైనం
లైవ్ హోల్సేల్ కిలో రూ.115
పేదోడికి దూరమవుతున్న చికెన్ రుచి
ప్రాణంతో ఉన్న ఓ కోడిని గుమ్మానికి వేలాడదీసి, దానిని చూస్తూ సినీనటుడు కోటా శ్రీనివాస రావు..ఒట్టి అన్నాన్ని లొట్టలేసుకుంటూ తింటాడు. ‘అహా.. నా పెళ్లంట’ అనే సినిమాలో ఈ దృశ్యం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. హాస్యం కోసం దర్శకుడు ఇలాంటి సన్నివేశాన్ని చిత్రీకరించాడు. అయితే నేడు పెరిగిపోతున్న చికెన్ ధరలతో ఇలా చేయక తప్పదేమో అంటున్నారు మాంసం ప్రియులు.
ఆళ్లగడ్డటౌన్: జిల్లాలో కోడిమాంసం ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో కిలో ధర రూ. 150 ఉండగా నేడు రూ.200కు పైగా పలుకుతోంది. రెండు నెలల క్రితం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బ్లర్డ్ ఫ్లూ రావడంతో లక్షల సంఖ్యలో కోళ్లను అధికారులు చంపి వేశారు. ఈ భయంతో ఇతర జిల్లాల్లోని కోళ్ల ఫారం యజమానులు కూడా కోళ్లను పెంచడం పూర్తిగా మానుకున్నారు. దీంతో ఈ ఏడాది కోళ్ల సంఖ్య తగ్గింది. అక్కడక్కడ పెంపకం చేపడుతున్న పాల్ట్రీ యజమానులు ధరలు పెంచేశారు. చర్మంతో కూడిన (విత్ స్కిన్) చికెన్.. పది రోజుల క్రితం కిలో రూ. 140 వరకు పలుకగా ప్రస్తుతం రూ. 200 వరకు అమ్ముతున్నారు. ఇక చర్మం లేకుండా (స్కిన్ లెస్) చికెన్ కిలో రూ. 220 వరకు విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. చికెన్ తినలేమని మాంసాహారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ధర పెరగడం గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు.
గుడ్డుకు గడ్డు కాలమే..!
పోషకాహారాల్లో గుడ్డుది ప్రధాన స్థానం. అనేక మంది శాఖహారులు సైతం గుడ్డును ఆహారంగా తీసుకుంటారు. ఇప్పటి కే పప్పుదినుసులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటడంతో గుడ్డు తిందామన్న గడ్డుకాలమే ఎదురౌతోంది. ఒక్కో గుడ్డు చిల్ల ధర రూ. 5 వరకు పలుకుతోంది. హోల్సేల్గా 100 గుడ్లు రూ 430 ధర ఉంది. సాధారణంగా హోల్సేల్ మార్కెట్లో 100 గుడ్లు రూ 275 నుంచి రూ 300 ధర ఉన్నప్పుడు ఒక్కో గుడ్డును రూ 4 అమ్మేవారు. మూడు రోజులుగా హోల్సేల్ మార్కెట్లోనే ఒక్కో గుడ్డు రూ. 5 ల పైగా అమ్ముతున్నారు. దీంతో కొన్ని రోజులు గుడ్డు తినడం మానుకోవడం మేలని ప్రజలు భావిస్తున్నారు.
రిటైల్ అమ్మకాలపై ప్రభావం
మార్కెట్లో చికెన్ ధరలు గణనీయంగా పెరగడంతో రిటైల్ వ్యాపారం బాగా తగ్గింది. కిలో...రెండు కిలోలు కోడి మాసం కొనేవారు పెద్దగా మక్కువ చూపడం లేదు. గతంలో ఆదివారం ఒక్క రోజే మా అంగట్లో 4 వేల కేజీలకు పైగా చికెన్ విక్రయించేవాళ్లం. ప్రస్తుతం 2వేల కేజీలు కూడా విక్రయించలేక పోతున్నావం. 20 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నా ఇంత ధర ఎప్పుడు అమ్మలేదు. చికెన్ ఇంత ధర పలుకుతుందని ఊహించను కూడా లేదు. - షరీఫ్, చికెన్ సెంటర్ యజమాని
అహనా..కోడంట!
Published Mon, Jun 15 2015 10:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 202: కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్
ఏపీ పరిశ్రమలపై ఈనాడు విషం.. అసలు విషయం ఇదే!
రఘరామలీలలు కన్నెత్తి చూడరు.. పట్టించుకోరు
చంద్రబాబుపై బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement