రుణాలు చెల్లించని రైతుల బంగారం వేలం | challapalli co-operative bank to auction gold to recover loans | Sakshi
Sakshi News home page

రుణాలు చెల్లించని రైతుల బంగారం వేలం

Feb 14 2015 2:39 PM | Updated on Oct 1 2018 2:00 PM

వ్యవసాయ రుణం కోసం రైతులు తాకట్టు పెట్టిన బంగారు నగలను వేలం వేసేందుకు కృష్ణాజిల్లా చల్లపల్లి కో ఆపరేటివ్ బ్యాంకు అధికారులు సిద్ధమయ్యూరు.

విజయవాడ :  వ్యవసాయ రుణం కోసం రైతులు తాకట్టు పెట్టిన బంగారు నగలను వేలం వేసేందుకు కృష్ణాజిల్లా చల్లపల్లి కో ఆపరేటివ్  బ్యాంకు అధికారులు సిద్ధమయ్యూరు. 207మంది రైతులు తనఖా పెట్టిన బంగారాన్ని వేలం వేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ సీపీ నేతలు వేలం ప్రక్రియను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. 

 

కాగా తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు నాయుడు ...అధికారం చేపట్టిన తర్వాత మాత్రం రుణాల మాఫీలో నిర్లిప్తత వహిస్తున్న విషయం తెలిసిందే. దాంతో రాష్ట్రంలో పలుచోట్ల ప్రాంతాల్లో రైతులు తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు అధికారులు వేలం వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement