కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్ | central government offices are strike | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్

Oct 8 2013 3:33 AM | Updated on Sep 18 2018 8:18 PM

కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్ ఉదయం నుంచే బ్యాంకులతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్, తపాలా, కమర్షియల్ ట్యాక్స్, ఎల్‌ఐసీ కార్యాలయాలు ఎక్కడిక్కడ మూతపడ్డాయి


 అనంతపురం న్యూటౌన్, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్ ఉదయం నుంచే బ్యాంకులతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్, తపాలా, కమర్షియల్ ట్యాక్స్, ఎల్‌ఐసీ కార్యాలయాలు ఎక్కడిక్కడ మూతపడ్డాయి. బంద్ ప్రభావం ముందే ఊహించిన అధికారులు ఎవ్వరూ కార్యాలయాలలోకి వెళ్లడానికి సాహసించలేదు. అయితే ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు తపాలా శాఖ, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాల్లో పలువురు ఉద్యోగులు విధులకు హాజరు కాగా.. వైఎస్సార్‌సీపీ నాయకులు వచ్చి వారిని బయటకు పంపించి వేశారు. మంగళ, బుధవారాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement