చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భక్తులపైకి ఇన్నోవా కారు దూకుకెళ్లిన ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భక్తులపైకి ఇన్నోవా కారు దూకుకెళ్లిన ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాళహస్తి ఆలయం సమీపంలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదానికి కారణమైన వారు కారు ఆపకుండా వెళ్లిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది.