బస్సు, లారీ ఢీ: ఒకరు మృతి | bus, lorry collision kills one in prakasham district | Sakshi
Sakshi News home page

బస్సు, లారీ ఢీ: ఒకరు మృతి

Jul 21 2015 6:57 AM | Updated on Jul 29 2019 5:43 PM

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ సమీపంలో ఓ పెద్ద ప్రమాదం తప్పింది.

ప్రకాశం: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. బస్సులో 24 మంది ప్రయాణికులు ఉండగా వారు అత్యవసర ద్వారాలు పగులగొట్టుకుని బయటపడ్డారు. అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చైన్నైకు చెందిన ఎస్‌ఆర్‌ఎం ట్రావెల్స్ బస్సు స్లీపర్ కోచ్ హైదరాబాద్‌కు వెళుతోంది.

అదే సమయంలో గుంటూరు జిల్లా దుర్గి మండలానికి చెందిన ఓ లారీ ఎదురుగా రాగా ఆ రెండూ సింగరకొండ వద్ద ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలు విడవగా, లారీ క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ గోపాలంతో పాటు మరో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement