విజయనగరం చేరుకున్న బొత్స సత్యనారాయణ | Botsa satyanarayana Ruturns to Home after two months | Sakshi
Sakshi News home page

విజయనగరం చేరుకున్న బొత్స సత్యనారాయణ

Oct 14 2013 11:31 AM | Updated on Mar 18 2019 9:02 PM

విజయనగరం చేరుకున్న బొత్స సత్యనారాయణ - Sakshi

విజయనగరం చేరుకున్న బొత్స సత్యనారాయణ

దాదానె రెండు నెలల అనంతరం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం విజయనగరం చేరుకున్నారు.

విజయనగరం : దాదానె రెండు నెలల అనంతరం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం విజయనగరం చేరుకున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం నుంచి ప్రకటన వెలువడిన నాటి నుంచీ ప్రజలకు మొహం చాటేసిన ఆయన  అంటే దాదాపు 75 రోజుల అనంతరం  జిల్లాకు వచ్చారు.  ప్రస్తుతం జిల్లాలో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో బొత్స రాక చర్చనీయాంశమైంది.  బొత్స ..... సన్నిహితులతో సమావేశం అయ్యారు. ఆయన రాక సందర్బంగా చీపురుపల్లి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు విజయనగరం చేరుకున్నారు.

కాగా జిల్లాలో పలు ఉద్రిక్తతలు నెలకొనడంతో పాటు హింసాత్మక సంఘటనలు తలెత్తడంతో ఎన్నడూ లేని విధంగా విజయనగరంలో కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో బొత్స రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇక విజయనగరంలో ఎనిమిదో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 1౦ గంటల వరకూ కర్ఫ్యూ సడలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement