
కాకినాడ సిటీ: కరోనా నియంత్రణలో భాగంగా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఉత్తర్వుల మేరకు మే 3వ తేదీ వరకు జిల్లాలోని కంటైన్మెంట్ జోన్లలో బ్యాంకు సేవలు పూర్తిగా నిలిపివేసినట్లు లీడ్బ్యాంక్ మేనేజర్ జె.షణ్ముఖరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బ్యాంకుల్లో అంతర్గత సేవలు కూడా నిషేధించామన్నారు. నాన్ – కంటైన్మెంట్ జోన్లలో బ్యాంకులను పనివేళల్లో తెరచి అంతర్గత కార్యకలాపాలకు ప్రభుత్వ, ప్రభుత్వ అండర్ టేకింగ్ లావాదేవీలకు అనుమతించినట్లు వివరించారు. ప్రజలకు సంబంధించి బ్యాంక్ లావాదేవీలు ఉండవన్నారు. ప్రజలు ఇంటర్నెట్, ఏటీఎం లావాదేవీలతో పాటు ఇతర డిజిటల్ లావాదేవీలు చేసుకోవచ్చన్నారు.