వేంపల్లె పట్టణంలోని వైఎస్ మదీనాపురంలో విషజ్వరంతో మొబీనా అనే ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది.
వైఎస్సార్ జిల్లా: వేంపల్లె పట్టణంలోని వైఎస్ మదీనాపురంలో విషజ్వరంతో మొబీనా అనే ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆర్థిక స్తోమత లేకపోవటంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం 3 గంటలకు ఆ చిన్నారి మృతి చెందింది. మృతికి కారణం డెంగీనా లేక టైఫాయిడా అనేది డాక్టర్లు ధృవీకరించలేదు.
(వేంపల్లె)