ఏటీఎం కార్డు చోరీ | ATM card theft | Sakshi
Sakshi News home page

ఏటీఎం కార్డు చోరీ

May 25 2014 1:13 AM | Updated on Sep 2 2017 7:48 AM

ఓ మహిళకు సంబంధించిన ఏటీఎం కార్డు చోరీను చోరీ చేసి, ఆమె ఖాతాలో రూ.లక్ష నగదు డ్రా చేసుకున్న ఉదంతమిది. అల్లవరం మండలం బెండమూర్లంకకు చెందిన రాయుడు

 అమలాపురం, న్యూస్‌లైన్ : ఓ మహిళకు సంబంధించిన ఏటీఎం కార్డు చోరీను చోరీ చేసి, ఆమె ఖాతాలో రూ.లక్ష నగదు డ్రా చేసుకున్న ఉదంతమిది. అల్లవరం మండలం బెండమూర్లంకకు చెందిన రాయుడు లక్ష్మిదుర్గ ఎస్‌బీఐ కొమరగిరిపట్నం బ్రాంచిలో ఖాతా ఉంది. ఈ ఖాతాకు చెందిన ఏటీఎం కార్డు చోరీకి గురైంది. భూమి కొనుగోలుకు లక్ష్మీదుర్గ భర్త నాగరాజు సోదరుడు రాయుడు శ్రీను గుజరాత్ నుం చి లక్ష్మీదుర్గ ఖాతాలో నగదును ఆన్‌లైన్ ద్వారా జమ చేశాడు. భూమి కొనుగోలు చేసేందుకు భార్య ఖాతా నుంచి నగదు డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లిన నాగరాజు తన భార్య ఖాతాలో రూ.లక్ష లేదని గుర్తించాడు. బ్యాంక్ అధికారులను ఆరా తీయగా, 4 దఫాలుగా రూ. 25 వేల చొప్పున బెండమూర్లంకలోని ఏటీఎం నుంచి డ్రా చేసినట్టు చెప్పారు. ఇంటికి వచ్చి ఏటీఎం కార్డు కోసం వెతికినా కనిపించకపోవడంతో పుట్టింట్లో ఉన్న లక్ష్మీదుర్గను ఫోన్ చేసి అడిగాడు. ఏటీఎం తన వద్ద లేద ని, గతంలో ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసుకుని రమ్మ ని ఇచ్చిన పొరుగింటి వ్యక్తే ఏటీఎం చోరీ చేసి, నగదు డ్రా చేసి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దీంతో నాగరాజు అల్లవరం పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై రాజేష్‌కుమార్ కేసు నమోదు చేయగా, సీఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement