Sakshi News home page

ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ఎప్పడైనా రావచ్చు

Published Sun, Jul 23 2017 5:24 PM

any time will issue nandyal by election notification

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ఎప్పుడైనా రావచ్చని, అందరూ సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ అధికారులకు సూచించారు. నంద్యాల ఉప ఎన్నికపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధికారులతో కర్నూలు స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ స్థానం ఖాళీ అయి సెప్టెంబర్ 12 నాటికి ఆరు నెలలు ముగుస్తాయని, అందువల్ల ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చని చెప్పారు. ఓటరు నమోదులో డబుల్ ఎంట్రీలను నివారించడంలో విఫలమయ్యారని, వెంటనే వాటిని సరిచేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement