రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సిసోడియా

Sisodia as the state's chief election officer - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)గా ఆర్‌.పి.సిసోడియాను నియమిస్తూ బుధవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భన్వర్‌లాల్‌ సీఈవోగా పనిచేశారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత జాయింట్‌ సీఈవో అనూప్‌సింగ్‌ రెండు రాష్ట్రాలకు ఇన్‌చార్జి సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.  

Read latest Amaravati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top