రుణమాఫీకి మరో మెలిక | Another bent debt waiver | Sakshi
Sakshi News home page

రుణమాఫీకి మరో మెలిక

Jun 25 2014 7:00 PM | Updated on Jun 4 2019 6:33 PM

పత్తిపాటి పుల్లారావు - Sakshi

పత్తిపాటి పుల్లారావు

ఏపీలో రైతుల రుణమాఫీకి ప్రభుత్వం మరో మెలిక పెట్టనుంది.

హైదరాబాద్:  ఏపీలో రైతుల రుణమాఫీకి ప్రభుత్వం మరో మెలిక పెట్టనుంది. రుణం మాఫీ చేయాలంటే లబ్ధిదారుడు ఆధార్ కార్డును చూపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్రమ లబ్ధిదారులను అరికట్టడానికే ఆధార్ లింక్ చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి  పత్తిపాటి పుల్లారావు చెప్పారు.

చాలామంది నకిలీ పాస్‌ పుస్తకాలతో రుణాలు పొందినట్లు ఆయన తెలిపారు. ఆ విధంగా రుణం పొందినవారిని నియంత్రించేందుకే ఆధార్‌ ఆలోచన అని మంత్రి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement