ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు 13న వెలువడనున్నాయి
అమరావతి: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఈ నెల 13న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో విడుదల చేస్తారని ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి ఉదయలక్ష్మి తెలిపారు. ఇంటర్ ప్రథమ..ద్వితీయ సంవత్సరం కలిపి 10.3 లక్షల మంది పరీక్షలు రాశారని ఆమె పేర్కొన్నారు.