
ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి.
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి తెలిపారు. ఇంటర్మీడియెట్ పరీక్షలను ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే.
వీటి ఫలితాలను శుక్రవారం ఉదయం 11.00 గంటలకు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం, https://www.sakshi.com/ https://www.sakshieducation.com వెబ్సైట్లలో పొందవచ్చు.