
ఆర్బీఐకి సమాధానపత్రం పంపిన ఏపీ ప్రభుత్వం
ధ్రప్రభుత్వంలోని రైతులకు రుణమాఫీపై చంద్రబాబు నాయుడు క్రమేపీ దిగివస్తోంది.
హైదరాబాద్ : రైతులకు రుణమాఫీపై చంద్రబాబు నాయుడు సర్కారు క్రమేపి దిగివస్తోంది. ఎన్నికల ముందు ప్రకటించిన రుణమాఫీపై ఇప్పటి వరకూ నాన్చవేత ధోరణి అవలంభిస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా ఆర్బీఐకీ సమాధాన పత్రం పంపింది. ఈ మేరకు గురువారం ఓ లేఖను ఆర్బీఐకి అందజేసింది. వ్యవసాయ, బంగారు రుణాలను కూడా ఏడేళ్లు పాటు రీ షెడ్యూల్ చేయాలని ఆ లేఖలో పేర్కొంది. తక్షణమే కొత్త రుణాలను మంజారు చేయాలని ఆర్బీఐకి విన్నవించింది. లక్షన్నర వరకూ రుణమాఫీ చేస్తామని ఆర్బీఐకి హామీ ఇచ్చింది. కాగా, అక్కడ కూడా దాటవేత ధోరణిని అవలంభించింది. రీషెడ్యూల్ పై కోటయ్య కమిటీ వేసామని ఆర్బీఐకి తెలిపింది.
రీషెడ్యూల్ ప్రతిపాదనపై వివరాలు కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) బుధవారం లేఖ రాసింది. రైతుల రుణాల రీ షెడ్యూల్కు ఆర్బిఐ అంగీకరించినట్లయితే.. మాఫీ చేసిన రుణాలను మూడేళ్లలో చెల్లించగలరా? అని రెండు ప్రభుత్వాలను ఆర్బిఐ ప్రశ్నించింది. రుణాల రీషెడ్యూల్ విధి విధానాలపై నివేదిక పంపాలని రెండు ప్రభుత్వాలను కోరింది.ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అధికార చేజిక్కించుకున్న చంద్రబాబు రుణాలు మాఫీ చేయలేక, కనీసం రీషెడ్యూల్ అన్నా చేయించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితులలో అనేక నిబంధనలతో ఆర్బిఐ ఓ లేఖను ఏపీ ప్రభుత్వానికి పంపింది. ఇందుకు ప్రతిగా ఓ లేఖను చంద్రబాబు సర్కారు ఆర్బీఐకి అందజేసింది. లక్షన్నర వరకూ రుణమాఫీ చే్స్తామని ఆర్బీఐకి నివేదిక అందజేసినా, మాఫీ చేసిన రుణాలను ఎప్పటిలోగా చెల్లిస్తామన్న దానిపై మాత్రం వివరణ ఇవ్వలేదు.