సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన అజేయ కల్లం

Ajay Kallam Meets YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ్‌ కల్లం మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా అజేయ కల్లం కేబినెట్‌ హోదాతో సీఎం ముఖ్య సలహాదారుగా నియమితులయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. 

అజేయ కల్లం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎం పేషీ) అధిపతిగా వ్యవహరిస్తారు. అలాగే సీఎంవో కార్యదర్శులకు శాఖల కేటాయింపు బాధ్యతతో పాటు రాష్ట్రంలో ఏ శాఖకు చెందిన అధికారినైనా పిలిచి సలహాలు ఇచ్చే అధికారాన్ని ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో ఆయన టీటీడీ కార్యనిర్వహణ అధికారిగా, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top