రెండేళ్ల తరువాత విడుదల కానున్న నోటిఫికేషన్
చిత్తూరులో 480, తిరుపతిలో 200 పోస్టులు ఖాళీ
చిత్తూరు (అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హోం మంత్రి, డీజీపీలు ఇటీవల ప్రకటించారు. దీంతో జిల్లాలో పోలీసు ఉద్యోగాలకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. దీనికితోడు ఈసారి పోలీసు సెలెక్షన్స్లో సమూల మార్పులు చోటుచేసుకోవడంతో ప్రతిభ ఆధారంగానే ఉద్యోగలక్ష్మి వరించనుంది. చిత్తూరు, తిరుపతి పోలీసు జిల్లాల్లో ఖాళీగా ఉన్న వందలాది పోస్టులకు ఈ ఏడాది చివరల్లోపు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. జిల్లాలో ప్రస్తుతం తిరుపతి, చిత్తూరు పోలీసు జిల్లాలు ఉన్నాయి. రెండు ప్రాంతాలకు ఇద్దరు ఎస్పీలు ఉన్నారు. అయితే 2013లో జిల్లా మొత్తం ఒక్కటే పోలీసు జిల్లా. అప్పట్లో జిల్లాలో 700 వరకు పోస్టులను పోలీసు శాఖలో భర్తీచేశారు. ఆ తరువాత ఎలాంటి నోటిఫికేషన్ వెలువడలేదు. మరోవైపు పోలీసుశాఖలో పెద్ద సంఖ్యలో సిబ్బంది ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఖాళీలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు రెండు పోలీసు జిల్లాలు ఏర్పడ్డాయి. సిబ్బంది పంపకాలు సైతం పూర్తవడంతో సిబ్బంది లోటుగా మారింది. తాజాగా రాష్ట్ర హోంమంత్రి నుంచి డీజీపీ వరకు కొత్త నోటిఫికేషన్పై స్పందిస్తూ, ప్రకటనలు చేస్తుండడం నిరుద్యోగుల్లో కొత్త ఆశలు పుట్టిస్తోంది. అన్నీ సవ్యంగా చేస్తే ఈ ఏడాది చివరిలోపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
పాత పద్ధతి రద్దు...
మరోవైపు పోలీసుశాఖలో సెలక్షన్స్ అంటేనే కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ స్థాయి పోస్టు వరకు తప్పనిసరి పరీక్ష 5 కిలో మీటర్ల పరుగుపందెం. ఆ పందేన్ని 25 నిముషాల్లో పూర్తి చేసిన అభ్యర్థులకు తరువాత లాంగ్జంప్, హైజంప్, షాట్పుట్, 100 మీటర్ల పరుగు పందెం పెడుతారు. ఇందులో మూడు ఈవెంట్స్లో అర్హత సాధించిన వారిని రాత పరీక్షలకు ఎంపిక చేస్తారు. చివరిగా రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఈవెంట్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలు కేటాయించడం ఇప్పటివరకు ఉన్న పద్ధతి. అయితే 5 కి.మీ పరుగు పందెం నిర్వహిస్తుండటంతో చాలాచోట్ల అభ్యర్థులు సొమ్మసిల్లి పడిపోయి, ఒక్కోసారి చనిపోతున్నారు. దీంతో ఈ పరుగును రద్దు చేసేదిశగా సెలక్షన్ బోర్డు, ప్రభుత్వం యోచిస్తోంది. పాత పద్ధతుల్లో సమూల మార్పులు చేసి, కేవలం ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేసే దిశగా కసరత్తు జరుగుతోంది.
ఖాళీలు ఇలా...
చిత్తూరు పోలీసు జిల్లా పరిధిలో ఎస్ఐ పోస్టులు 15, సివిల్ కానిస్టేబుల్ (పురుషులు) 230, మహిళలు 15, ఏఆర్ విభాగంలో 220 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తిరుపతి పోలీసు జిల్లాలో ఎస్ఐలు 8, కానిస్టేబుళ్లు (ఏఆర్, సివిల్) 210 వరకు ఖాళీలున్నాయి. కొత్త నోటిఫికేషన్ విడుదలయితే జిల్లా వ్యాప్తంగా దాదాపు 680 పోస్టులు భర్తీ కానున్నాయి.
పోలీస్ కొలువులు సిద్ధం
Published Sat, Sep 12 2015 3:40 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
లేఆఫ్స్కు గురయ్యారా?.. హెచ్1- బీ వీసాలో కొత్త నిబంధనలు
సెలబ్రెటీల స్వీట్ ఫ్యామిలీస్ (ఫోటోలు)
Wamiqa Gabbi: క్యూట్ లుక్స్తో ఫిదా చేస్తున్న వామిక గబ్బి (ఫోటోలు)
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
Advertisement