ఏసీబీకి చిక్కిన వీఆర్వో | acb caught vro in tirupathi | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

Aug 17 2015 1:28 PM | Updated on Aug 17 2018 12:56 PM

తిరుపతి పట్టణంలోని 19వ వార్డు ఎస్టీవీ నగర్ వీఆర్వో ఆదిలక్ష్మి సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు.

తిరుపతి: తిరుపతి పట్టణంలోని 19వ వార్డు  ఎస్టీవీ నగర్ వీఆర్వో ఆదిలక్ష్మి సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. మల్లికార్జున అనే వ్యక్తి కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా, రూ.2 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో సోమవారం లంచం తీసుకుంటుండగా వీఆర్వోను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె నివాసంలో సోదాలు ప్రారంభించారు. ఆమెపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement