నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
Dec 14 2015 2:27 PM | Updated on Aug 17 2018 12:56 PM
తుంగతుర్తి: నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ రైతుకు పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చేందుకు వీఆర్వో హుసేన్ బాబా లంచం డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ ని ఆశ్రయించాడు. సోమవారం తుంగతుర్తిలో బాబా రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఆయన్ను ఏసీబీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Advertisement