రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు.. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవకతవకల నేపథ్యంలో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. . శ్రీకాకుళం, విశాఖ, అనంతపురం, కడప, నెల్లూరు, రాజమండ్రి, ఒంగోలు ఆఫీసుల్లో రికార్డులు పరిశీలిస్తున్నారు. నిర్మాణ అనుమతుల్లో ఏవైనా అవినీతి జరిగిందా అనే అంశం ఆరా తీస్తున్నారు.


