ఏసీబీకి చిక్కిన వీఆర్వో | acb caught vro in ananthpur distirict | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

Published Wed, Aug 19 2015 1:41 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌడనళ్లి గ్రామ వీఆర్వో లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు.

మడకశిర: అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌడనళ్లి గ్రామ వీఆర్వో లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. గ్రామానికి చెందిన బాలకృష్ణ అనే రైతు తన భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం కోసం కొన్ని రోజులుగా తిరుగుతున్నాడు. వీఆర్వో శివప్ప మాత్రం రూ.5 వేలు ఇస్తేనే పని అవుతుందని మెలికపెట్టాడు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం మధ్యాహ్నం బాలకృష్ణ నుంచి శివప్ప డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. వీఆర్వో పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement