మూడు వాహనాల్లో గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నర్సీపట్నం (విశాఖపట్నం) : మూడు వాహనాల్లో గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని డిగ్రీ కళాశాల సమీపంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 65 కిలోల గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక కారు, ఒక ఆటో, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.