కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు 50శాతం జీతాలు పెంపు | 50 Percent hike in salary of contract employees in andhra pradesh | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జీతాలు పెంపు

Apr 18 2017 1:38 PM | Updated on Jun 2 2018 2:36 PM

ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు తీపి కబురు అందించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు 50 శాతం జీతాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్‌ నుంచి పెంచిన జీతాలు అమల్లోకి రానున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు కామినేని శ్రీనివాస్‌, కాల్వ శ్రీనివాసులు మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించమని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను ఆయా శాఖలు రెన్యువల్‌ చేస్తాయన్నారు. అయితే కాంట్రాక్ట్‌ ఉద్యోగాల నియామకానికి భవిష్యత్‌లో ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement