వేగంగా వెళ్తున్న ఆటో టైరు పేలడంతో బోల్తా పడింది.
కృష్ణా : వేగంగా వెళ్తున్న ఆటో టైరు పేలడంతో బోల్తా పడింది. ఈ సంఘటన మంగళవారం కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం చినపాలపర్రు గ్రామంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్తానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను గుడివాడ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు.
(ముదినేపల్లి)