వైఎస్ఆర్ కడప జిల్లాలోని జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలోని జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆదివారం జమ్మలమడుగులో జిల్లా జాయింట్ కలెక్టర్ రామారావు, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికలు ప్రశాంతంగా జరగుతాయని స్ఫష్టం చేశారు.
ఎన్నిక నేపథ్యంలో పట్టణంలో భద్రత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు. భద్రత దృష్ట్యా ముందస్తుగా కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. పట్టణంలో 144 సెక్షన్ విధించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు.