breaking news
-
వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు.. పల్నాడులో టెన్షన్!
సాక్షి, పల్నాడు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాదరణ చూసి కూటమి సర్కార్ కొత్త కుట్రలకు తెర లేపింది. ఆయన పర్యటనలకు వెళ్లకుండా అడ్డంకులు సృష్టించేందుకు కొత్త ప్లాన్తో ముందుకు సాగుతోంది. వైఎస్ జగన్ నేడు పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా.. ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ పర్యటనపై పోలీసులు సాయంతో కూటమి సర్కార్ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది.వైఎస్ జగన్ నేడు పల్నాడు జిల్లా రెంటళ్లపాడు పర్యటన సందర్బంగా పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ పర్యటనకు కేవలం వంద మంది మాత్రమే రావాలంటూ పోలీసులు ఆంక్షలు పెట్టారు. కేవలం మూడు వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామని ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, నిరసన, ధర్నా కాకపోయినా ఇలా.. పోలీసుల ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించే స్వేచ్చ కూడా లేదా అంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ద్వారా వైఎస్ జగన్ పర్యటనను కూటమి సర్కార్ నియంత్రించే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇక, వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు అనుమతి కోసం ఇప్పటికే ఏడు సార్లు జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. అయినప్పటికీ పోలీసులు ఇలా ఆంక్షలు విధించడమేంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ ఆదేశాల మేరకే వైఎస్ పర్యటనలను నియంత్రించేందుకు పోలీసులు ఇలా ఆదేశాలు జారీ చేశారని అటు ప్రజలు సైతం మండిపడుతున్నారు. మరోవైపు.. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన వద్దంటూ వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు నోటీసులు పంపించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సహా పల్నాడు జిల్లా నేతలందరికీ నోటీసులు అందించారు. బుధవారం ఉదయం నుంచే వాహనాలను వెళ్లకుండా అడ్డంకులు సృష్టంచారు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వాహనాలను అడ్డుకుంటున్నారు. నరసరావుపేట, మాచర్ల, గుంటూరు వైపు నుండి సత్తెనపల్లి వైపు వాహనాలను వెళ్లనీయడం లేదు. రెంటపాళ్ల ఊరిలోకి ఇతరులను రానీయకుండా అడ్డుకుంటున్నారు. గ్రామస్థులను కూడా ఆధార్ కార్డు చూపాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇక, ఇప్పటికే రెంటపాళ్లకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నారు. -
కూటమి కొత్త ఎత్తుగడ.. చెవిరెడ్డి అక్రమ అరెస్ట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్బుక్ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా కూటమి సర్కార్ అరాచకానికి తెగబడుతోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో భేతాళ కుట్రకు తెరతీసింది. ఆ కుట్రలో తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసింది. అంతటితో ఆగకుండా ఆయన కుమారుడు మోహిత్రెడ్డి, మరో నలుగురిపై కేసు నమోదు చేసింది. లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడులను మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరు పరచి, ట్రాన్సిట్ వారెంట్పై బుధవారం విజయవాడకు తీసుకురానున్నారు. అనంతరం వారిద్దరినీ విజయవాడ న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది. తద్వారా చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసేందుకు కొన్ని రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రం బట్టబయలైంది. ఈ అక్రమ కేసులో తాజాగా వెంకటేశ్ నాయుడు(ఏ34), బాలాజీ కుమార్ యాదవ్ (ఏ35), యద్దాల నవీన్ (ఏ36), హరీశ్ (ఏ37), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (ఏ38), చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (ఏ39)లను నిందితులుగా చేరుస్తూ సిట్ విజయవాడ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. ఏకంగా సుప్రీం ఆదేశాలు, హెచ్చరికలు బేఖాతరు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వ బేతాళ కుట్ర ఇలా సాగుతోంది.కోర్టును తప్పుదారి పట్టించే ఎత్తుగడఈ కేసులో మంగళవారం సాయంత్రం వరకు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడులను సిట్ నిందితులుగా చేర్చనేలేదు. కానీ, వారిపై గుట్టుచప్పుడు కాకుండా లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. నిందితులుగా చేర్చక పోయినా లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం సిట్ బరితెగింపే. సొంత కంపెనీ పనిపై చెవిరెడ్డి మంగళవారం ఉదయం కొలంబో వెళ్లి.. తిరిగి బుధవారం సాయంత్రం వచ్చేలా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు.ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వెంకటేశ్ నాయుడులను అక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి (ఏ38), వెంకటేశ్ నాయుడు (ఏ34)తోపాటు మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ సిట్ అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు.అంటే బెంగళూరు విమానాశ్రయంలో వారిని అదుపులోకి తీసుకునే వరకు వారు ఈ కేసులో నిందితులే కారు. అయినా సరే వారిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసి వారిని అడ్డుకోవడం కచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే. ఇదిలా ఉండగా, తాను ఎప్పుడు పిలిచినా సిట్ విచారణకు రావడానికి సిద్ధమని ఇప్పటికే చెవిరెడ్డి పలుమార్లు ప్రకటించారు. తన కోసం చిన్న చిన్న ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని, వేధించవద్దని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అయినా ఆయన ఎక్కడికో పారిపోతున్నట్లు సిట్ రహస్యంగా లుక్ అవుట్ నోటీసులిచ్చి అరెస్ట్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. -
కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి : చంద్రబాబు సొంత నియోజకవర్గంలో మహిళపై పచ్చ సైకోల అరాచకంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? అంటూ ప్రశ్నించారు. కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇది నిదర్శనం అంటూ ధ్వజమెత్తారు.. ‘మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా?. సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే.తిమ్మరాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించాడు. ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు. చంద్రబాబు.., మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి. పొలిటికల్ గవర్నెన్స్, రెడ్బుక్ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయంలో భాగంగా మీరు, మీ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు. ఈ ఘటనతోపాటు, ఏడాదికాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్గా తీసుకోవాలని, చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు..@ncbn గారూ.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే. తిమ్మరాయప్ప… pic.twitter.com/GDVWPB65AZ— YS Jagan Mohan Reddy (@ysjagan) June 17, 2025 -
తాట తీస్తా.. తోలు తీస్తా.. అన్నావ్ కదా పవన్ ఇప్పుడు ఏమైంది?
సాక్షి,విశాఖ: రాష్ట్రంలో మహిళలపై దారుణాలు జరుగుతుంటే తాట తీస్తా.. తోలు తీస్తానన్న పవన్ కల్యాణ్ ఏమయ్యారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త ఓ మహిళను నడిరోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి.. చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. ఆ ఘటనపై వరుదు కల్యాణి మీడియాతో మాట్లాడారు.మహిళలు, బాలికలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నాయి. విశాఖలో టీడీడీపీ కార్యకర్త మహిళను వివస్త్ర చేసి దాడి చేసినా పట్టించుకోలేదు.సత్యసాయి జిల్లాలో బాలికపై లైంగికదాడికి పాల్పడింది టీడీపీ వాళ్లే. నిందితులు అధికార టీడీపీకి చెందిన వాళ్లే కావడంతో ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. రాష్ట్రంలో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. మహిళలపై ఎవరైనా చేయివేస్తే తాట తీస్తానన్న పవన్ ఎక్కడున్నారు?మహిళల భద్రతను గాలికొదిలేశారు. హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారు?. రెడ్బుక్ రాజ్యాంగానికి ఇచ్చిన ప్రాధాన్యత మహిళల భద్రతకు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. -
‘ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే రక్షణ?’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక మహిళన చెట్టుకు కట్టేసిన అమానుష ఘటనపై మాజీ మంత్రి, ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలకు కూటమి ప్రభుత్వం ఇచ్చే రక్షణ ఇదేనా? చంద్రబాబు సర్కారును నిలదీశారు. చివరికి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే మహిళలకు భద్రత లేదని ధ్వజమెత్తారు. ‘రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. ఒక మహిళని చెట్టుకు కట్టేసి కొడితే ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?, ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే రక్షణ?, మహిళలపై అఘాయిత్యాలు చేస్తే అదే చివరి రోజని చంద్రబాబు బడాయి మాటలు చెప్తున్నారు. మరి ఆయన సొంత నియోజకవర్గంలో దారుణం జరిగితే చంద్రబాబు ఏం చేస్తున్నారు?, రాష్ట్రమంతా అరాచకం రాజ్యమేలుతోంది. మహిళ హోంమంత్రిగా ఉండికూడా ఉపయోగం లేదు. కుప్పం బాధిత మహిళను పరామర్శించే సమయం కూడా హోంమంత్రికి లేదా?, వీడియో కాల్ చేసి మాట్లాడటం హోంమంత్రి అహంకారానికి నిదర్శనం’ అని మండిపడ్డారు ఆర్కే రోజా. -
ధృతరాష్ట్ర పాలన.. ‘మమ్మల్ని ఎవడ్రా ఆపేది!’
ముఖ్యమంత్రి చంద్రబాబుకు తనపాలన ఎలా ఉందో అర్థమవుతోందా? సూచాయిగా బాబుకు రాష్ట్రంలో సీను అర్థమైందా?.. తమ్ముళ్ల అరాచకాలు కనిపిస్తున్నాయా?.. వారిని కంట్రోల్ చేయలేక తమలపాకుతో కొడుతున్నారా? అసలిది ఆయన ప్రభుత్వమేనా.. లేక లోకేష్ మొత్తం పాలనను.. ప్రభుత్వాన్ని హైజాక్ చేసి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం చేస్తున్న పరిపాలనా ?..రాష్ట్రంలో పరిపాలన కన్నా కక్షలు.. కార్పణ్యాలు తీర్చుకోవడమే లక్ష్యంగా పడుతున్న తప్పుబడుగులను బాబు సరిదిద్దే పని చేయడం లేదా? దుర్యోధనుడి మాదిరిగా లోకేష్ అరాచకాలు సాగిస్తుంటే చంద్రబాబు కూడా పుత్రవాత్సల్యంతో దృతరాష్ట్రుడిలా చూడలేకపోతున్నారా ? ఇలాంటి సందేహాలు రాష్ట్రప్రజలను చుట్టుముడుతున్నాయి. గెలిచింది మొదలు లోకేష్ చేస్తున్న ప్రకటనలు, ప్రతిపక్ష నేతలు.. సోషల్మీడియా కార్యకర్తలమీద చట్టాన్ని అడ్డంపెట్టుకుని చేస్తున్న దాడులు .. కేసులు బాబుకు లీలగా కనిపిస్తున్నాయా ? వినిపిస్తున్నాయా ? అదే అనిపిస్తోంది.బాబుపాలనకు వచ్చి ఏడాదైన సందర్భంగా పలు ప్రయివేటు జిల్లాల్లో చేపట్టిన సర్వేల్లో ఘోరమైన ప్రజాభిప్రాయం వెల్లడవుతోంది. టీడీపీ నేతల అరాచకాలు.. దొమ్మీలు .. దోపిడీలు బాబు ప్రభుత్వ ప్రతిష్టను ఎలా దిగజారుస్తున్నదీ ఆ సర్వేలో వెల్లడింది.. ఘనవిజయం సాధించిన ఎమ్మెల్యేలు సైతం పెచ్చుమీరిన అవినీతిలో మునిగితేలియాడుతున్నారు. ఇదంతా ఇంటెలిజెన్స్ .. ఇతర సర్వే సంస్థల ద్వారా బాబు చెవిన పడిందా ?. ఇసుక.. గనులు.. వ్యాపారాలు ఇలా అన్ని రంగాల్లోనూ ఎమ్మెల్యేలు కార్యకర్తల రుబాబు ఆకాశాన్ని తాకింది. ఈ వ్యతిరేకత అంతా తాజా సర్వేల్లో వెల్లడైంది. అయితే ఇది బాబు దృష్టికి వెళ్లిందని.. అందుకే విశాఖలో యోగా కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా అయన కార్యకర్త్తలను సున్నితంగా హెచ్చరించారని అంటున్నారు. గట్టిగా వార్ణింగ్ ఇవ్వలేక సుతిమెత్తగా తమలపాకుతో .. నెమలీకతో కొట్టినట్లుగా మెత్తని హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలోనే అయన 'ఎమ్మెల్యేల పని తీరుపై మొన్న సర్వే చేయించా.. ప్రజల్లో రిపోర్టు బాగుంటే జిందాబాద్.. లేదంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తా.. కార్యకర్తలే అధినేత.. ఇది సాధ్యం కావడం కోసం ఎమ్మెల్యేలు పని చేయాలి.. కార్యకర్తల నుంచి నివేదిక తెప్పించుకుంటా.. వాళ్ల మద్దతు లేకపోతే పక్కన పెడతా' అంటూ హెచ్చరికలు చేసారు. ఇలా చెబితే ఎవరు వింటారు.. మళ్ళా ఎవరి దందాల్లో వాళ్ళుంటారు.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ టీడీపీ నాయకులు... కార్యకర్తలు తల ఎగరేస్తున్నారు. ::: సిమ్మాదిరప్పన్న -
వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం
సాక్షి, పల్నాడు: పోలీసుల వేధింపులు భరించలేకే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన కుటుంబానికి భరోసా ఇవ్వడానికి తమ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి కచ్చితంగా వస్తారని వైఎస్సార్సీపీ నేతలు కుండబద్ధలు కొట్టారు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన అనుమతి కోసం మంగళవారం నరసరావుపేటలో పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. జగన్ అంటే జనం.. జనం అంటేనే జగన్. ఆయన వస్తున్నారంటే జనం ఆగరు. కానీ, జగన్ వస్తున్నారని పోలీసులు రకరకాలుగా వేధిస్తున్నారు. జగన్ పర్యటనను విఫలం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. అయినా వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటించడం ఖాయం’’ అని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు.కుట్ర ప్రకారమే జగన్ పర్యటన అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడైనా అడ్డుకున్నామా?. మరి వైఎస్ జగన్ పర్యటన అంటే కూటమి ఎందుకు భయపడుతోంది?. నాగమల్లేశ్వరావును టీడీపీ నేతలు, పోలీసులు వేధించారు. అది భరించలేకే ఆయన సూసైడ్ చేసుకున్నారు. కూటమి సర్కార్ వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయి. ఈ అరాచక పాలన తట్టుకోలేకనే జనం రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా జగన్ పర్యటించడం ఖాయం అని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. -
రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్రెడ్డి.. విధ్వంసకాండకు తెరతీసేలా
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో ఎల్లో గూండాలు రెచ్చిపోతున్నారు. విధ్వంసకాండకు తెరతీసేలా జేసీ ప్రభాకర్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేయాలంటూ పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నేతలను కొడితే దిక్కెవడంటూ జేసీ ప్రభాకర్రెడ్డి రెచ్చిపోయారు.సీఎం చంద్రబాబు 3 నెలలు మమ్మల్ని వదిలేయాలంటూ జేసీ వ్యాఖ్యానించారు. టీడీపీ విమర్శించేవారందరినీ ఉతికి ఆరేస్తామన్న జేసీ.. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అంతుచూస్తానంటూ జేసీ గూండాగిరి ప్రదర్శించారు. -
‘వైఎస్ జగన్ పల్నాడుకు వెళ్తే.. బాబు సర్కార్కి భయమెందుకు?’
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటలను అడ్డుకునే కుట్ర జరుగుతోందని.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సత్తెనపల్లి వెళ్తే చంద్రబాబు సర్కార్కు ఉన్న ఇబ్బందులు ఏంటి? అంటూ ఆయన ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించే హక్కు వైఎస్ జగన్కు ఉందన్నారు.‘‘స్వచ్ఛందంగా తరలివచ్చే ప్రజలను నియంత్రించాల్సిన బాధ్యత మీదే. పొదిలిలో వైఎస్ జగన్కు వచ్చిన జన స్పందన చూసి టీడీపీ ప్రభుత్వం భయపడుతోంది. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. చంద్రబాబు సర్కార్ బ్రిటీష్ చట్టాలను అమలు చేసి వైఎస్సార్సీపీని అణచి వేయాలని చూస్తోంది. 30 యాక్ట్ పేరుతో వైఎస్సార్ సీపీ నేతల పర్యటనలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం‘‘శాంతియుత నిరసనలు, సమావేశాలకు భారత రాజ్యాంగం అనుమతి ఇచ్చింది. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. కేసులు పెడతాం, పెట్టిస్తాం అంటూ పోలీసులు బెదిరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని శైలజానాథ్ పేర్కొన్నారు. -
చెవిరెడ్డిని ఇరికించేందుకే మదన్ను హింసించారు
సాక్షి, గుంటూరు: లిక్కర్ స్కాం కేసులో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఇరికించే కుట్ర జరుగుతోంది ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే చెవిరెడ్డి దగ్గర గతంలో గన్మెన్గా పని చేసిన మదన్ను దారుణంగా హింసించారని తెలిపారాయన. మంగళవారం ఉదయం తాడేపల్లిలో మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లిక్కర్ కేసులో చెవిరెడ్డిని ఇరికించేందుకు సిట్ అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. చెవిరెడ్డి పేరు చెప్పాలంటూ ఆయన మాజీ గన్మ్యాన్, హెడ్ కానిస్టేబుల్ అయిన మదన్ని చిత్రహింసలు పెట్టారు. మదన్ 10 ఏళ్లు చెవిరెడ్డి దగ్గర గన్మెన్గా పని చేశారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని సిట్ అధికారులు మదన్పై ఒత్తిడి తెచ్చారు. ఆయన మొహం మీద, వీపు మీద పిడిగుద్దులు గుద్దారు. చేతి వేళ్లు వెనక్కి విరిచి తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని టార్చర్ పెట్టారు. .. సిట్ అధికారుల హింస వల్ల మదన్ ఆరు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఈ చిత్రహింసల గురించి మదన్ సీఎంతో పాటు రాష్ట్ర డీజీపీకి లేఖ కూడా రాశారు. ఆ లేఖలో వివరాలన్నీ క్షుణ్ణంగా ఉన్నాయి. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లబోతున్నాం’’ అని మనోహర్రెడ్డి మీడియాకు వివరించారు.నేడు హైకోర్టులో విచారణఏఆర్ కానిస్టేబుల్ మదన్ తరపున వైఎస్సార్సీపీ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. లిక్కర్ కేసులో సిట్ అధికారులు బలవంతపు వాంగ్మూల సేకరణ జరుపుతున్నారని, భౌతిక దాడులకు దిగుతున్నారని, విచాచరణ పారదర్శకంగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని మదన్ ఆ పిటిషన్లో అభ్యర్థించారు. ఇదీ చదవండి: చంద్రబాబు ఇలాకాలో దారుణం -
పోలీసులతో మమల్ని అణచలేరు: అంబటి రాంబాబు
గుంటూరు: వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులతో అణచలేరని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలైన తర్వాత అంబటి రాంబాబు మాట్లాడారు. ‘సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు బెయిల్ పై విడుదల కావడం జరిగింది..సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు అనంతరం ఆయనను విడుదల చేయాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశించింది..కేసు నమోదు చేసిన తుళ్లూరు పోలీసుల పట్ల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడాన్ని కోర్టు తప్పు పట్టింది. కేవలం చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు రావటం లేదు అని కొమ్మినేని శ్రీనివాసరావు పై లక్ష్యకట్టి అరెస్ట్ చేశారు..చీమకి కూడా హాని చేయకుండా కలం కోసం పని చేస్తున్న జర్నలిస్ట్ను జైలులో పెట్టడం దుర్మార్గం. పోలీసుల అదుపులో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు పై అరమరావతి రాజధాని ప్రాంత ప్రజల ముసుగులో టీడీపీ గుండాలు దాడికి ప్రయత్నం చేశారు..రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత కేవలం మైక్ ముందే హోం మంత్రి.. ఇకపై డిబేట్లు పెట్టే అవకాశం లేదు అంటూ హోం మంత్రి అనిత మాట్లాడడం సిగ్గుచేటు. చీకటి పడిన తరువాత కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలని చంద్రబాబు, లోకేష్ జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు..పోలీసులతో మమల్ని అణచలేరు’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. -
అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: చంద్రబాబు బెదిరింపు రాజకీయాలకు ఇక భయపడేదని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పర్యటనల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హాట్ కామెంట్స్ చేశారాయన. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ..వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నెల 18వ తేదీన రెంటపాళ్ల పర్యటనకు ఆటంకాలు కలిగిస్తోంది. జనాలను పంపి హింసకు ప్రేరేపించాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు. ఈ క్రమంలోనే.. అనుమతి పేరిట విచిత్రమైన ఆంక్షలు పెడుతున్నారు. రెంటపాళ్లలో వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అతని కుటుంబ సభ్యుల పరామర్శకు జగన్ వెళ్తుంటే.. ప్రభుత్వం పిచ్చి చేష్టలకు దిగుతోంది. చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబాన్ని పరార్శించడానికే జగన్ వెళ్తున్నారు. తమ కార్యకర్త చనిపోతే.. పార్టీ అధినేత పరామర్శించటం తప్పా?. మేమేమీ బహిరంగ సభలకు వెళ్లటం లేదు. కానీ పోలీసుల వ్యవహారశైలి చూస్తుంటే జగన్ అసలు బయటకు రావటానికి వీల్లేదన్నట్టుగా ఉంది. పొదిలిలో కూడా రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టి రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే. అంతేకానీ జగన్ను పర్యటించొద్దని అనడం కరెక్టు కాదు. జగన్ పర్యటనలో హింస సృష్టించేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. అధికారం ఉందని అతిగా ప్రవర్తించద్దని ఆ తండ్రీకొడుకులకు చెప్తున్నాం. జనాన్ని పెట్టి కోడిగుడ్లు, టమోటాలు వేయించాలనుకోవటం దారుణం. జనాన్ని అణచి వేయాలనుకుంటే కుదరదు. చంద్రబాబు హెచ్చరికలు ఏపాటివో మా చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. ఆయన రాజకీయాలను చూసి మేము భయపడేది లేదు’’ అని అంబటి అన్నారు. -
విద్యార్థుల జీవితాలతో ఆటలా చంద్రబాబు.. కూటమి ప్రభుత్వంపై రవిచంద్ర ఫైర్
సాక్షి,తాడేపల్లి: గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి, ఈ ఏడాది కూడా అరకొర నిధులు ప్రకటించిన టీడీపీ కూటమి ప్రభుత్వం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయకుండా, వారి జీవితాలతో ఆడుకుంటోందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర ఆక్షేపించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎ.రవిచంద్ర హెచ్చరించారు.ప్రెస్మీట్లో ఎ.రవిచంద్ర ఇంకా ఏం మాట్లాడారంటే..:విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలు: విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ చేయలేదు. ఫీజు చెల్లించకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు టీసీ ఇవ్వకుండా వేధిస్తున్నాయి. మరోవైపు దీనిపై ఇప్పటికే సమావేశమైన ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు, ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. ఇందులో అధికార పార్టీ నాయకులకు చెందిన కాలేజీలు కూడా ఉన్నాయి. విద్యార్థుల తరఫున చెల్లించాల్సిన ఫీజుకు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్, ఆ మాట నిలబెట్టుకోకుండా.. ఏడాది పాలన ఘనతలంటూ డప్పుకొట్టుకోవడం దారుణం. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఐదేళ్ల కాలంలో అమలు చేసిన విద్యా సంస్కరణలను ఏడాదిలోనే నాశనం చేశారు. విద్యార్థులకు విద్యాదీవెన కిట్లు కూడా సకాలంలో అందని పరిస్థితి నెలకొంది. పరీక్షలు కూడా విజయవంతంగా నిర్వహించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీల భూములపై కన్నేసి కాజేయడానికి టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు. పిల్లల చదువులను ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవడం లేదు.విద్యార్థుల బకాయిలు రూ.6,400 కోట్లు: 2024 ఏప్రిల్ నుంచి 2025 జూన్ 16 నాటికి ఆరు త్రైమాసికాలకు సంబంధించి విద్యార్థులకు ప్రభుత్వం రూ.6,400 కోట్లు బకాయి పడింది. అందులో రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కాగా, రూ.2,200 కోట్లు స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. ఈ మొత్తం ఎప్పటిలోపు చెల్లిస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు. ఫీజు బకాయిలు ఎప్పటికప్పుడు విడుదల చేయని కారణంగా పేద విద్యార్థులు చదువులు మధ్యలోనే ఆపేయాల్సిన దుస్థితి నెలకొంది. కొందరు విద్యార్థులు ఫీజులు కట్టుకోవడం కోసం కూలీ పనులకు వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక క్వార్టర్లీ ఫీజు చెల్లింపు విధానాన్ని రద్దు చేసి హాఫ్ ఇయర్లీ విధానం తీసుకొచ్చారు. తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీల ఖాతాల్లోనే విద్యార్థుల ఫీజులు జమ చేస్తామని చెప్పారు. రెండుసార్లు గడువు పూర్తయినా విద్యార్థుల తరఫున ప్రభుత్వం ఫీజులు జమ చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాయి. పరీక్షలప్పుడు హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో అంగీకార పత్రాలు రాయించుకుని వారిని పరీక్షలకు పంపించిన దుస్థితికి రాష్ట్ర విద్యావ్యవస్థను తీసుకెళ్లారు.అబద్ధాలు చెబుతున్న ప్రభుత్వం: రెండు క్వార్టర్ల ఫీజు చెల్లించామని ఈ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. వాస్తవానికి ఏడాది కాలంలో కేవలం ఒకటిన్నర క్వార్టర్ ఫీజును మాత్రమే జమ చేసింది. ఒక క్వార్టర్ పూర్తిగా ఇచ్చి ఇంకో క్వార్టర్ సగం మాత్రమే చెల్లించి రూ.300 కోట్లు పెండింగ్ పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏటా రూ.2,800 కోట్లు, స్కాలర్షిప్ కింద మరో రూ.1,100 కోట్లు.. అలా ఏటా మొత్తం రూ.3,900 కోట్ల చొప్పున రెండేళ్లకు కలిపి రూ.7800 కోట్లు చెల్లించాలి. కానీ కూటమి ప్రభుత్వం ఒకటిన్నర క్వార్టర్ ఫీజు మాత్రమే చెల్లించి రూ.6400 కోట్లు పెండింగ్ పెట్టింది. ఈ ఏడాది బడ్జెట్లో అరకొరగా రూ.2,600 కోట్ల కేటాయింపు చూపినా, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా విద్యార్థుల చదువులను గాలికొదిలేసింది.ఐదేళ్లలో రూ.18 వేల కోట్లు చెల్లించిన వైఎస్ జగన్ ప్రభుత్వం: గత వైస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ప్రతి త్రైమాసికానికి రూ.720 కోట్ల చొప్పున ఎప్పటికప్పుడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమయ్యేది. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో నిధులు ఎప్పుడు జమ చేసేది కూడా పత్రికల ద్వారా నాటి జగన్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పడంతో విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా ఐదేళ్ల చదువులు సాఫీగా సాగిపోయాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పేద పిల్లల చదువులను సమస్యలు చుట్టుముట్టాయి. గతంలో ఏ కాలేజీ యాజమాన్యం, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల కోసం ఎదురు చూసిన పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక కాలేజీల యాజమాన్యాలు మూడుసార్లు మంత్రి నారా లోకేష్ని కలిసి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల చేయాలని కోరినా ఫలితం లేదు. 2019–24 మధ్య విద్యాదీవెన కింద 29,65,930 మంది విద్యార్థులకు రూ.12,608 కోట్లు, వసతి దీవెన కింద రూ.4,276 కోట్లు చెల్లించారు. మొత్తంగా 54,83,175 మంది పిల్లలకు 5 ఏళ్లలో రూ.16 వేల కోట్లకు పైగా చెల్లించారు. దీంతోపాటు 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1,778 కోట్లు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. పిల్లల చదువుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నీ విడుదల చేయాలని, లే పక్షంలో విద్యార్థులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఎ.రవిచంద్ర హెచ్చరించారు. -
‘తల్లికి వందనం.. లోకేష్ తనకు తానే సవాల్ విసురుకున్నాడు’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అధికారం కోసం వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పేర్లు మార్చారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది. 30 లక్షల మందికి తల్లులకు తల్లికి వందనం ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారని ఘాటు విమర్శలు చేశారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, వైఎస్సార్ కార్పొరేటర్ విజయవాడలో జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాలనుఈ పుస్తకంలో వివరించాము. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారు. చంద్రబాబు అధికారం కోసం వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పేర్లు మార్చారు. 30 లక్షల మందికి తల్లులకు తల్లికి వందనం ఎగ్గొట్టారు. వైజాగ్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ లేరని విద్యార్థులు ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి.చంద్రబాబు 17 వందల కోట్లు పెట్టిన బకాయిలను వైఎస్ జగన్ తీర్చారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం దారుణం. జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని అందరు చదవాలి. కరెంటు చార్జీల పేరుతో చంద్రబాబు రూ.15 వేల కోట్లు వసూలు చేస్తున్నారు. బుడమేరుతో ముంపు గురైన ప్రజలకు న్యాయం చేసిన పరిస్థితి లేదు. శాతవాహన కళాశాల ను కబ్జాకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హిందూ దేవాలయాల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారు దాడి చేస్తున్నారు. సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది. లోకేష్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తల్లికి వందనంలో 87 లక్షల మంది తల్లులకు ఇవ్వాలని లెక్కలు ఉన్నాయి. లోకేష్ తనకు తానే సవాల్ విసురుకుంటున్నాడు’ అని అన్నారు.డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో వైఎస్ జగన్ బటన్ నొక్కితే హేళనగా మాట్లాడారు. మీరెందుకు బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లో నగలు జమ చేయడం లేదు. చంద్రబాబు ఎవరికీ మంచి చేసిన విధానం లేదు. చంద్రబాబు మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. వైఎస్ జగన్ స్కూల్ డెవలప్మెంట్ కోసం డబ్బులు కేటాయిస్తే హేళన చేశారు. మీరు.. 13 వేలు తల్లులు ఖాతాలో వేసి మోసం చేశారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టండి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. చదువుకునే విద్యార్థులు, రైతులు, మహిళలను చంద్రబాబు మోసం చేశాడు’ అని తెలిపారు. -
సీమలోనూ సీను సితారే!
గెలిచి సరిగ్గా ఏడాది కాలేదు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు పదవుల్లో కూర్చుని గట్టిగా సమచ్చరం కాలేదు. అప్పుడే జనాలకు ప్రభుత్వం మీద ఏవగింపు మొదలైంది . వచ్చిన కొత్తల్లోనే ఎక్కడికక్కడ దందాలు.. రౌడీయిజం వంటివి మొదలెట్టి ఇదీ మా బ్రాండ్.. ఇదీ మా స్టైల్ అని చెప్పుకునే విధంగా అడుగులు మొదలెట్టారు. దీంతో ప్రజల్లో వీళ్ళు ఏదో చేస్తారు?.. అనుకుంటే చివరకు రౌడీయిజం చేస్తున్నారా అనే అభిప్రాయాలూ మొదలయ్యాయి. తెలుగుదేశానికి మొదట్నుంచి పట్టున్న జిల్లాల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఇదిలా ఉండగా ప్రజలకు ఏదో చేస్తాం.. పథకాలిస్తాం.. ఉద్యోగాలిస్తాం.. పారిశ్రామిక ప్రగతి చేసి చూపిస్తాం అంటూ ఘనంగా చెప్పుకుని వచ్చిన ఈ నాయకులు. వస్తూనే రెడ్ బుక్ ఓపెన్ చేసి ఒక్కో పేజీలో ఎవరి పేర్లు ఉన్నాయి.. వారిలో అధికారులు ఎవరు ? వైఎస్సార్సీపీ నాయకులూ ఎవరన్నది ఏరుకుని మరీ టార్గెట్ చేసి కేసులు పెట్టడం.. లొంగనివారిపై.. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించడం వంటి పనులు తప్ప ప్రజలకు పనికొచ్చేది ఏమీ చేయలేదన్న అభిప్రాయం మొదలైంది. దీంతోబాటు.. పల్లెల్లో చిల్లర రాజకీయాలు చేయడం.. ఆలయాల్లో విధ్వంసాలు.. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇంకా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు.. ఇలాంటి అవలక్షణాలు తప్ప కాన్ఫిడెంట్ గా ప్రభుత్వాన్ని నడిపే పనిలో లేకపోవడాన్ని ప్రజలు గ్రహించారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభుత్వ వ్యతిరేకత లోలోన నివురుగప్పిన నిప్పులా ఉంటోంది. బయటకు అందరూ ఆహా.. ఓహో అని అంటున్నా.. ప్రజల్లో మాత్రం ఇది ఉత్త డబ్బారాయుడి ప్రభుత్వం అనే అభిప్రాయం గట్టిగానే ఉంది. ఈ నేపథ్యంలో.. మొన్నటి ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించిన స్థానాల్లో సైతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్ల అబ్బే.. ఏదో అనుకున్నాం.. ఏం లేదు అనే భావన వినిపిస్తోందని అంటున్నారు. బాబు పాలన ఏడాదైన సందర్భంగా కొన్ని సంస్థలు చేపట్టిన సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. వాస్తవానికి వైయస్ జగన్కు గట్టిపట్టున్న రాయలసీమలో కూడా 2024 ఎన్నికల్లో కూటమి మంచి ఫలితాలు సాధించింది. మొత్తం 52 సీట్లున్న పూర్వపు రాయలసీమ నాలుగు జిల్లాల్లో కూటమికి 45 స్థానాలు దక్కాయి. వైఎస్సార్సీపీ కడపలో 3, చిత్తూరు.. కర్నూలులో రెండేసి చొప్పున మొత్తం ఏడు స్థానాల్లోనే గెలిచింది. అయితే ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది సర్వేలు చెబుతున్నాయి. సీమలో గెలిచినా 45 మందిలో పట్టుమని పదిమందికి కూడా ప్రజల్లో పట్టు చిక్కలేదు. అందుకే ఏకంగా 33 మందిమీద తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయి. అందులో 29 మంది ఎమ్మెల్యేలకు అయితే అనవసరంగా వీళ్ళను ఎందుకు గెలిపించామురా దేవుడా అని ప్రజలు లోలోన బాధపడుతున్నారట. వాళ్ళు మళ్ళీ గెలవడం అసాధ్యమని ప్రజలు చెబుతున్నారు. ఇక ఇటు వైసిపి నేతలు.. ఓడిపోయినా ఎమ్మెల్యేలమీద ప్రజలకు గురికుదిరిందని.. వాళ్ళుంటేనే బావుణ్ణని ప్రజలు అనుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. మొత్తానికి చాలామంది టిడిపి ఎమ్మెల్యేలు వన్ టైం ఎమ్మెల్యేలుగా నిలిచిపోతారని అంటున్నారు. అధికారం వచ్చింది సొంత ఆస్తులు పెంచుకోవడానికి అనే భావనలో ఉన్న నాయకులకు గడ్డుకాలమే అని అంటున్నారు.- సిమ్మాదిరప్పన్న -
సూపర్ సిక్స్ కాదు.. ఫస్ట్ బాల్కే కూటమి అవుట్: బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, హైదరాబాద్: సూపర్ సిక్స్ అని గొప్పగా చెప్పుకునే సీఎం చంద్రబాబు ప్రజల దృష్టిలో మొదటి బాల్కే అవుట్ అయ్యారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేశానంటూ సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజలకు న్యాయం చేస్తే.. హామీలను అమలు చేయకుండానే నెరవేర్చేసినట్టు కూటమి సర్కార్ మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులు తగ్గి, ఆదాయం పెరిగితే.. కూటమి ఏడాది పాలనలో ఆదాయం తగ్గి, అప్పులు పెరిగాయనే విషయాన్ని ఆధారాలు, గణాంకాలతో సహా వివరించారు. వాస్తవాలను దాచిపెట్టి, అద్భుతమైన పాలనను అందించామని.. హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే సహించనని చంద్రబాబు బెదిరించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. తాను వెల్లడించిన గణాంకాలు వాస్తవం కాదు అని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని సవాల్ విసిరారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే..తల్లికి వందనం మహామోసంతల్లికి వందనం పథకం ప్రారంభం.. ఏడాది పాలన పూర్తి సందర్భంగా చంద్రబాబు మీడియా సమావేశంలో పచ్చి అబద్ధాలను మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేశామంటూ, దానిపై మాట్లాడినే నాలుక మందం అంటూ ప్రతిపక్షంతో పాటు ప్రజలకు కూడా హెచ్చరికలు చేశారు. ఎన్నికల ముందు తల్లికి వందనం కింద ప్రతి విద్యార్ధికి రూ.15 వేల చొప్పున 87 లక్షల మందికి ఇస్తామని చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు అందులో 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. అదికూడా కేవలం రూ.13 వేలు మాత్రమే ఇస్తున్నారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.4 వేల చొప్పున పెన్షన్ ఇస్తామన్నారు. ఆడబిడ్డ నిధి కింద 2.07 కోట్ల మందికి నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. 53.50 లక్షల మందికి రైతు భరోసా కింద రూ.20 వేల చొప్పున ఇస్తామన్నారు. ఇందుకు ఏడాదికి రూ.10 వేల కోట్లకు పైగా అవసరం కాగాజజ కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. ఉద్యోగం రాని యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 1,54,047 మందికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అని ఊదరగొట్టారు. వాటిని ఎప్పుడు ఇస్తారని ప్రజలు అడుగుతున్నారు. ప్రజల తరఫున ప్రతిపక్షంగా వాటినే వైఎస్సార్సీపీ అడుగుతోంది. వాటికి సమాధానంగా అన్ని సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాశానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది.బడ్జెట్, వ్యయాలు.. సంక్షేమ లెక్కలివి– వైఎస్సార్సీపీ 2023–24లో బడ్జెట్ రూ.2,35,780 కోట్లు. 2024–25లో కూటమి ప్రభుత్వ బడ్జెట్ రూ.2,45,076 కోట్లు. అంటే మా కంటే కూటమి ప్రభుత్వం రూ.10 వేల కోట్లు బడ్జెట్లో ఎక్కువగా పెట్టింది. వైఎస్సార్సీపీ హయాంలో ఏడాదికి జీతాల కోసం వెచ్చించింది రూ.52 వేల కోట్లు. పెన్షన్లు రూ.21,500 కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ.29,500 కోట్లు. ఇవన్నీ కలిపితే మొత్తం రూ.1,03,000 మా ప్రభుత్వ హయాంలో చేసిన వ్యయం. మూలధనం పెట్టుబడి కింద చేసిన వ్యయం రూ.23,300 కోట్లు. మొత్తం బడ్జెట్ రూ.2,35,780 కోట్లలోనే జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు చేసిన వ్యయాలను తీసేస్తే మిగిలిన నిధులు సుమారుగా రూ.1,09,000 కోట్లు. ఈ నిధుల నుంచే వైఎస్ జగన్ ప్రకటించిన అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేశాం.– కూటమి ప్రభుత్వంలో జీతాల కోసం ఖర్చు చేసింది రూ.59 వేల కోట్లు, పెన్షన్లు రూ.27 వేల కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ.31 వేల కోట్లు. ఇవన్నీ కలిపితే కూటమి హయాంలో చేసిన వ్యయం మొత్తం రూ.1,18,000 కోట్లు. ఈ ప్రభుత్వంలో చేసిన మూలధన పెట్టుబడి వ్యయం రూ.19వేల కోట్లు. బడ్జెట్లోంచి జీతాలు, వడ్డీలు, పెన్షన్లకు చేసిన వ్యయం తీసేస్తే మిగిలిన నిధులు మొత్తం రూ.1,07,000 కోట్లు. మరి ఇన్ని నిధులు ఉండి కూడా ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో చంద్రబాబు వివరణ ఇవ్వాలి. కేవలం కూటమి ప్రభుత్వంలో హామీల్లో అమలు చేసింది రూ.వెయ్యి పెన్షన్ పెంచడం తప్ప మరొకటి కనిపించడం లేదు.సంపద సృష్టి అంటే ఇదేనా?– అప్పులపై చంద్రబాబు ఎన్నికల ముందు అనేక అబద్ధాలు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన నాటికి ఏపీకి ఉన్న అప్పు రూ.1,40,717 కోట్లు. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే 2019 నాటికి ఉన్న మొత్తం రాష్ట్ర అప్పులు రూ.3,90,247 కోట్లు. అంటే టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.2,49,350 కోట్లు. సీఏజీఆర్ ప్రకారం చూస్తే 22.63 శాతం ఎక్కువగా అప్పులు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే 2024 నాటికి ఉన్న మొత్తం రాష్ట్ర అప్పులు రూ.7,21,918 కోట్లు. అంటే ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో చేసిన అప్పులు కేవలం రూ.3,32,671 కోట్లు. వైఎస్సార్సీపీ హయాంలో సీఏజీఆర్ 13.5శాతం మాత్రమే. ఇవన్నీ కాగ్ నివేదికలో ఉన్న లెక్కలు. వీటిని వక్రీకరిస్తూ వైఎస్సార్సీపీ హయాంలో రూ.14 లక్షల కోట్ల అప్పులు అంటూ చంద్రబాబు విష ప్రచారం చేశారు. శ్రీలంక, కంబోడియాగా ఏపీని మార్చేస్తున్నారంటూ దిగజారుడు ప్రచారం చేశారు. – వైఎస్సార్సీపీ పాలనలో 2022–23లో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం రూ.1,57,768 కోట్లు. 2023–24లో రూ.1,73,767 కోట్లు. ఆ రెండేళ్లలో ఆదాయం చూస్తే 10శాతం పెరిగింది. ఆ ఏడాది అప్పులు చూస్తే 19 శాతం మాత్రమే పెరిగాయి. కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే అప్పులు 30 శాతం పెంచితే.. ఆదాయం మాత్రం కేవలం 3 శాతం మాత్రమే పెరిగింది. ఇదేనా చంద్రబాబు సంపద సృష్టి?. 2024 ఏప్రిల్ నాటికి రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.3,500 కోట్లు అయితే, 2025 ఏప్రిల్లో నాటికి వచ్చిన రాష్ట్ర జీఎస్టీ రూ.2,652 కోట్లు. అంటే.. 24 శాతం తక్కువగా వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రానికి సంబంధించిన పన్ను ఆదాయం 2024లో రూ.7,483 కోట్లు కాగా, 2025లో వచ్చిన ఆదాయం రూ.6,569 కోట్లు. అంటే 12 శాతం ఆదాయం పడిపోయింది. పన్నేతర ఆదాయం ఏప్రిల్ 2024లో రూ.442 కోట్లు అయితే, 2025 ఏప్రిల్ నాటికి రూ.345 కోట్లు. అంటే 22 శాతం తక్కువ. ఏప్రిల్ 2024లో పన్ను, పన్నేతర ఆదాయం కలిపి లెక్కిస్తే రూ.7,925 కోట్లు కాగా, 2025 ఏప్రిల్ నాటికి వచ్చిన మొత్తం ఆదాయం రూ.6914 కోట్లు. అంటే 12 శాతం తక్కువ.ఉద్యోగుల సొమ్మును వాడేశారుఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, డీఏల అమలు ఏదీ. రాష్ట్ర విభజన జరిగినప్పుడు మొత్తం పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ రూ.32,997 ఉంది. అందులో ఏపీ భాగం 19,138 కోట్లు. 2014–19 నాటికి రూ.76,516 కోట్లు. అంటే టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన రూ.57,378 కోట్ల సొమ్మును అదనంగా వాడుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ రూ.76,038 కోట్లు. అంటే మేం ఉద్యోగుల సొమ్మును వాడుకోకపోగా రూ.478 కోట్లను మేం తిరిగి జమ చేశాం. కానీ.. ఉద్యోగుల విషయం మా ప్రభుత్వంపై విష ప్రచారం చేశారు.ఏడాదిలోనే తీవ్రమైన ప్రజావ్యతిరేకతప్రశ్నించడానికే పార్టీ పెట్టానంటున్న పవన్కళ్యాణ్ ఈ విషయాలపై ఎందుకు దీనిపై మౌనంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని దుకాణాలు వెలవెలబోతుంటే.. ఒక్క మద్యం దుకాణాలు మాత్రమే కళకళలాడుతున్నాయి. గ్రామాల్లో వ్యాపారాల కోసం కాల్మనీ నుంచి ఫైనాన్స్ తీసుకుని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఏడాది కూటమి పాలనపై కేకే సర్వేలోనే తీవ్ర ప్రజావ్యతిరేకత వ్యక్తమైందని తేలింది. ఏడాది పాలన తరువాత కూటమి ప్రభుత్వం ప్రజలను బెదిరిస్తోంది. ఏడాదిలో ఎన్నో అరాచకాలు చేశారు. చివరకు ప్రశ్నించే జర్నలిస్ట్లను కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి, వేధించారు. -
‘ఉచిత పంటల బీమాకు కూటమి సర్కార్ ఎగనామం’
తణుకు: రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకువస్తే, కూటమి ప్రభుత్వం దానిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల తరుఫున ప్రీమియం కింద రూ.700 కోట్లు చెల్లించడాన్ని భారంగా చూపుతూ కూటమి ప్రభుత్వం ఈ పథకాన్నే పూర్తిగా ఎత్తేసేందుకు సిద్దపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి వైఫరీత్యాల సమయంలో రైతులకు అండగా నిలిచే ఈ పథకాన్ని తీసేయడానికి వ్యవసాయం అంటే చంద్రబాబుకు ఉన్న చిన్నచూపే కారణమని ధ్వజమెత్తారు. తక్షణం ప్రభుత్వం దిగివచ్చి ఉచిత పంటల బీమాకు ప్రీమియంను భరించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..రైతులకు మేలు చేయాలని వైఎస్ జగన్ గత ప్రభుత్వంలో ఉచిత బీమా పథకాన్ని అమలు చేశారు. దీనిని పూర్తిగా వక్రీకరిస్తూ ఎల్లోమీడియా ఈనాడు పత్రికలో వైకాపా హయాంలో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించారు. కూటమి ప్రభుత్వమే ప్రీమియంగా దాదాపు రూ.700 కోట్లు చెల్లించాల్సి వస్తోందని ఉచిత బీమా పథకాన్ని అటకెక్కించిన మాట వాస్తవం కాదా? ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులపై ఒక్క పైసా భారం పడకుండా ఈ పథకాన్ని అమలు చేసింది. అయిదేళ్ళ పాటు ఈ ఉచిత బీమా వల్ల రైతులకు లబ్ది చేకూరింది. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంతో బీమా ప్రీమియం చెల్లించకపోవడం వల్ల గత ఏడాది ప్రకృతి వైఫరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు దాదాపు రూ.1300 కోట్ల మేర పరిహారం దక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రీమియం కడితేనే దానికి కేంద్రం వాటా విడుదల అవుతుంది. కూటమి ప్రభుత్వంలో ఇది జరగలేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో అయిదేళ్ళలో సుమారు 5.52 కోట్ల ఎకరాలకు ఉచిత పంటల బీమా కవరేజీ కల్పించాం. 2014-19 చంద్రబాబు హయాంలో ఉచిత పంటల బీమా కింద రైతులకు ఇచ్చింది కేవలం రూ.3,400 కోట్లు మాత్రమే. వైఎస్ఆర్సీపీ హయాంలో పంట బీమా కింద ఇచ్చింది రూ.7800 కోట్లు. ఇదీ రైతులంటే వైఎస్ జగన్ కు ఉన్న ప్రేమ.గత ఏడాది పంటల బీమాకు ఎగనామంకూటమి ప్రభుత్వం గత ఏడాది ఉచిత పంటల బీమా పథకాన్నికి ఎగనామం పెట్టింది. ఏడాది కాలంగా రైతుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదు. రైతులకు ఈక్రాప్ వల్ల ఉచిత పంటల బీమాను పకడ్బందీగా అమలు చేశాం. దేశంలోనే తొలిసారిగా ఆర్బీకేను ఏర్పాటు చేసి విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు బాసటగా నిలిచాం. వైఎస్ఆర్ రైతుభరోసా కింద అయిదేళ్ళలో రూ.34,200 కోట్లను రైతుల ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పి, నేటికీ దానిని అమలు చేయలేదు. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి నెలలు గడుస్తున్నా వారికి చెల్లించాల్సిన డబ్బులను కూడా జమ చేయలేదు. మంత్రులు నాదెండ్ల మనోహర్ను రైతులు నేరుగా నిలదీస్తున్నా వారిలో చలనం కలగడం లేదు.ఒకవైపు ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోళ్లు అరకొరగా చేస్తున్నారు, మరోవైపు మధ్యదళారీలు తక్కువ రేట్లకే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం అమ్మి రైతులు డబ్బు కోసం ఎదురుచూస్తుంటే ఈనాడుకు కనిపించడం లేదా? పొదిలిలో పొగాకు రైతులకు అండగా నిలబడేందుకు వైఎస్ జగన్ వెడితే దాదాపు లక్ష మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ గోడును ఆయన దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ైయస్ జగన్ పర్యటన కాగానే వెంటనే ప్రభుత్వం హడావుడిగా పొగాకు కొనుగోళ్ళకు ప్రయత్నిస్తోంది. ఉచిత పంటల బీమాను ఎత్తివేయడం ద్వారా రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తోంది. రైతుల తరుఫున ప్రీమియను ప్రభుత్వమే చెల్లించి, రైతులను ఆదుకోవాలి. రైతు అమ్ముకునే సందర్బంలో గిట్టుబాటు ధర లేక అన్యాయమై పోతున్నాడు. ప్రజలు మాత్రం అధిక రేట్లకు కందిపప్పు కొనుగోలు చేస్తున్నారు. మధ్యలో దళారీలు దోచుకుంటున్నారు. వీరిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. కంది రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి, మార్కెట్లో కందిపప్పు రేట్లను నియంత్రించాలి. మామిడి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి’ అని డిమాండ్ చేశారు. -
‘పథకం ప్రకారమే పొదిలిలో రాళ్ల దాడి’
తాడేపల్లి: పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు పొదిలికి వచ్చిన వైయస్ జగన్ పై కుట్రపూరితంగానే టీడీపీ రాళ్ళ దాడి చేయించిందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ ఎక్కడకు వెళ్ళినా పెద్ద ఎత్తున వస్తున్న ప్రజాధరణను చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేక పోతోందని మండిపడ్డారు. దీనిలో భాగంగానే పొదిలిలో ఒక ప్రణాళిక ప్రకారం జగన్ కాన్వాయిలో అరాచకం సృష్టించేందుకు హింసకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...పొగాకు వేలం కేంద్రానికి వైయస్ జగన్ వేలాది మందితో ర్యాలీగా వస్తుంటే టీడీపీ దాడులకు తెగబడింది. కొంతమంది నల్లబెల్లూన్లతో నిరసన తెలిపే పేరుతో ముందు నిలబెట్టి వారి వెనుక రాళ్ల కుప్పను ఏర్పాటు చేసి, ర్యాలీపైకి రాళ్ళతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా ఈ ప్రతికా సమావేశంలో ప్రజలు చూసేందుకు ప్రదర్శిస్తున్నాం. ఈ వీడియోల్లో చాలా స్పష్టంగా ఎలా టీడీపీ మూకలు దాడి చేశాయో చూడవచ్చు. మాజీ ముఖ్యమంత్రి ర్యాలీగా వస్తుంటే నల్ల బెలూన్లు, ప్లకార్డులతో నిలబడి నిరసన తెలిపే వారికి పోలీసులు ఎలా పర్మిషన్ ఇచ్చారు? నిరసనకు ఎవరు పర్మిషన్ అడిగారు? ఆ అర్జీ ఎక్కడుందో చూపించాలి. రాళ్ల దాడులకు పాల్పడిన వారిలో నలుగురైదుగురు తప్ప స్థానికులు ఎవరూ లేరు. కేవలం అక్కడ స్థానికుల ఇంటి స్థలాన్ని మాత్రమే దాడులకు వాడుకున్నారు. టీడీపీ వారు మా ర్యాలీపై దాడులు చేస్తుంటే జిల్లా ఎస్పీ స్వయంగా నిలబడి వారికి రక్షణ కల్పించడం దారుణం. ఈ రాళ్ల దాడుల్లో తలలు పగిలి అమాయకులైన రైతులు తీవ్రంగా గాయపడ్డారు. దాడులు చేసిన వారిని వదిలేసి పోలీసులు లాఠీలతో వాతలు తేలేలా రైతులను చావబాదారు. మళ్లీ అర్థరాత్రి వేళ మా నాయకుల ఇళ్లమీద పడి జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులను అరెస్ట్ చేశారు. మన్నం శ్రీధర్ అనే మా పార్టీకి చెందిన జిల్లా ప్రధాన కార్యదర్శిని బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఇంట్లో నుంచి ఎందుకు తీసుకెళ్లారు? ఆయనేమైనా రౌడీషీటరా? ఆయన మీద ఏమైనా కేసులున్నాయా? ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత కాదా? నష్టపోతున్న పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అడగడం మా పార్టీ చేసిన తప్పా? రైతులను కొట్టిన పోలీసుల మీద సుమోటోగా కేసులు నమోదు చేయాలి.నిరసనకి ఎలా అనుమతించారు?జగన్ కార్యక్రమానికి వేలాదిగా జనం వస్తారని తెలిసి కూడా నిరసనలకు ఎలా అనుమతించారు? ఏదైనా జరగరాని సంఘటన జరిగి ఉంటే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? 50 వేల మంది ర్యాలీగా వచ్చి 40 మంది మీద దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదా? కానీ నిరసన పేరుతో టీడీపీ నాయకులు ఎంతగా కవ్వించినా మా కార్యకర్తలెవరూ చలించలేదు. క్రమశిక్షణతో నడుచుకున్నారు కాబట్టే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. మా నాయకుడి మాదిరిగానే మా కార్యకర్తలకు విలువలు, విశ్వసనీయతకి ఈ ఘటన ఉదాహరణ. 40 మంది టీడీపీ నిరసనకారుల కోసం 400 మంది పోలీసులను రక్షణగా మోహరించారు. దాడుల కోసం ఇళ్లపై రాళ్లకుప్పలను సిద్ధం చేసుకున్నారు. టీడీపీ నాయకులే దాడులకు తెగబడినట్టు ఎన్నో వీడియోలు సాక్ష్యంగా ఉన్నా మా నాయకుల మీదనే అక్రమ కేసులు నమోదు చేశారు. ఆఖరుకి జైళ్లలో ఉన్న వారి కోసం పరామర్శకు వెళితే మా జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాదరెడ్డి మీద ఈ దుర్మార్గపు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. మా నాయకులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పట్ల సీఐ దురుసుగా వ్యవహరించాడు.మహానటులు టీడీపీ నేతలుపొరుగు రాష్ట్రంలో సినిమా రంగంలోని నిష్ణాతులకు ఇచ్చిన అవార్డులను రాజకీయాల్లో అత్యుత్తమ నటులు, దర్శకులుగా ఉన్న టీడీపీ వారికి ఇవ్వాలి. ఉత్తమ దర్శకుడు అవార్డు ఏపీ సీఎం చంద్రబాబుకి, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు అవార్డు కొలుసు పార్థసారథికి, ఉత్తమ కమెడియన్ అవార్డు పట్టాభి చౌదరికి, ఉత్తమ విలన్ నారా లోకేష్కి ఇవ్వాలి. వారే దాడులు చేసి మేమే దాడులు చేసినట్టు మా నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక దళితుల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి. ప్రతిపక్ష నేత తెనాలిలో దళిత యువకులను పరామర్శించడానికి వెళితే వారి మీద రౌడీషట్ ఉందని ప్రచారం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి చనిపోతే పరామర్శించడానికి తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ వెళ్లారు. ఆ వీరయ్య చౌదరి మీద కూడా ఆరు క్రిమినల్ కేసులున్నాయి. వారు చెప్పేదాని ప్రకారం నేరారోపణలు ఉన్నప్పుడు పరామర్శించడానికి ఎలా వెళ్లారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వెళ్లొచ్చా? దళితులను పరామర్శించడానికి మేం వెళితే తప్పు, మీ పార్టీ నాయకుల కోసం మీరు వెళితే ఒప్పా? దీనికి మంత్రి కొలుసు పార్థసారథి సమాధానం చెప్పాలి. రాష్ట్ర రాజకీయాల్లో పట్టాభి చౌదరి పేపర్ పులి. ప్రత్యక్ష రాజకీయాల్లో కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవని పట్టాభి చౌదరి, మాజీ సీఎం వైయస్ జగన్ ను ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పటికే వైయస్ జగన్ని ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడి రాష్ట్రంలో గతంలో జరిగిన అనేక సంఘటనలకు పట్టాభి బాధ్యుడయ్యాడు. ఇప్పటికీ ఏమయ్యా జగన్ రెడ్డీ అంటూ తన నోటిదూల ప్రదర్శిస్తున్నాడు. నోటికొచ్చినట్టు పేలితే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నా. వైయస్ జగన్ అంటే మీకు ఇష్టం లేకపోయినా ఆయన రాష్ట్రంలోని ఎంతోమందికి దేవుడు. తాడేపల్లి కొంప, బెంగళూరు కొంప అని నీచంగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడితే పట్టాభి మీద కేసులుండవా? రెడ్ బుక్ పేరుతో మా పార్టీ నాయకుల మీద జరుగుతున్న దాడులన్నీ గుర్తుంచుకుంటాం. అన్నింటికీ వడ్డీతో సహా చెల్లించుకుంటాం. రైతన్నలను పరామర్శించడానికి వెళితే ప్రతిపక్ష నాయకుడి మీద జరిగిన రాళ్ల దాడిని ఈ రాష్ట్ర రైతులంతా చూశారు. ఈ రాళ్లే రేపటి రోజున జగన్ మీదకి పూలవుతాయి. టీడీపీ వేసిన చెప్పులే ఆయన మెడలో మాలలవుతాయి. మంత్రి పార్థసారథి అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి. పట్టాభి చౌదరిని టీడీపీ నాయకత్వం కంట్రోల్ లో పెట్టుకోవాలి. వైయస్సార్సీపీ నాయకులను అక్రమ కేసులతో వేధించడం మీద పెట్టిన శ్రద్దను ప్రజాసమస్యల పరిష్కారం మీద పెట్టాలి’ అని టీజేఆర్ సూచించారు. -
‘ఏడాదంతా మోసమే.. అంతా అభూత కల్పనే’
తిరుపతి: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిస్తూనే ఉందని విమర్శించారు తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడుడ భూమన కరుణాకర్రెడ్డి. తమ నాయకుడు వైఎస్ జగన్.. రూ. 2 లక్షల 80 కోట్లు డీబీటీ రూపంలో ప్రజలకు నేరుగా అందిస్తే అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేశాడన్నారు. ఈరోజు(ఆదివారం, జూన్ 15వ తేదీ) ‘జగన్ అంటే నమ్మకం- చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని భూమన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీలు సిఫాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎమ్మెల్యే సునీల్, విజయానందరెడ్డి, నూకతోటి రాజేష్, తిరుపతి పార్లమెంట్ పరిశీలకుడు చవ్వా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా భూమన మాట్లాడుతూ.. 2 కోట్ల 7 లక్షల మంది మహిళలకు నెలకు రూ. 1500 ఇవ్వకుండా మోసం చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. నిరుద్యోగ భృతి రూ. 3 వేలు ఇస్తామని చెప్పిన వ్యక్తి.. ఈ రోజు మోసం చేసిన విషయం కళ్లకు కనపడుతోందన్నారు. 30 లక్షల మంది తల్లులకు తల్లికి వందనం మోసం. రైతులకు రూ. 20 వేలు ఇస్తామని మోసం. తల్లికి వందనపై ప్రశ్నించే వాళ్లకు బెదిరింపులు. ఈ ఏడాది మొత్తం మోసాలు చేశాడు.. ఒక అభూత కల్పనతో మోసగించాడు. వైఎస్సార్సీపీ వాళ్లపై దాడులు చేయించి కేసులు పెట్టి జైల్లో పెట్టించాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచారు’ అని భూమన ధ్వజమెత్తారు. -
‘జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలు, మోసాలపై ‘వెన్నుపోటు’ పుస్తకాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఆదివారం ఆవిష్కరించారు. కన్న బాబురాజు, కంబాల జోగులు, అదీప్ రాజు, పెట్ల ఉమాశంకర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏడాది కాలంలో లక్ష యాభై వేల కోట్ల అప్పు తప్ప చేసిందేమీ లేదు.. త్వరలో అక్రమ మైనింగ్పై కూడా పోరాటం చేస్తాం. వైఎస్ జగన్ చెప్పిన హామీలతో పాటు చెప్పని హామీలను కూడా అమలు చేశారని గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు.కూటమి మోసాలపై వెన్నుపోటు పుస్తక ఆవిష్కరణ.. విశాఖపట్నం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎంపీ బాబురావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్ తదితరులు ఆవిష్కరించారు.అక్రమాల్లో చంద్రబాబు పీహెచ్డీ: గొల్ల బాబురావుపేద ప్రజలను మోసం చేయడం.. అక్రమాలు చేయడంలో చంద్రబాబు వేయి పీహెచ్డీలు చేశాడు. వైఎస్ జగన్ సంక్షేమ పాలనను ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. మోసం పోయాం అని గ్రహించి ప్రజలు మళ్లీ జగన్ను గెలిపించాలని అనుకుంటున్నారు. జగన్ అంటే నమ్మకం.. బాబు అంటే మోసం అని ప్రజలకు వివరించాలి.హమీలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలం: కేకే రాజుఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు వైఫల్యం చెందారు. వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందించారు. నాడు ఏడాదిలో జగన్ అన్ని పథకాలను అమలు చేశారు. జగన్ ఇచ్చిన మాట మీద నిలబడితే.. బాబు మోసం చేశాడు. ఎల్లో మీడియాలో ప్రతీ రోజూ అబద్దపు కథనాలు రాస్తున్నారు. హామీల గురించి ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామని లోకేష్ బెదిరిస్తున్నాడు.అప్పులు చేయడం సంపద సృష్టించడమా?: వరుదు కల్యాణిగతంలో మూడు సార్లు సీఎంగా చేసిన బాబు ఎప్పుడూ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ప్రజలను బాబు మరోసారి మోసం చేశాడు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం సరే.. మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడ పిల్లలగా పుట్టడమే పాపమా అన్నట్టు ఉంది. ప్రభుత్వ దృష్టి అంతా అమరావతి అవినీతిపైనే ఉంది. ఏడాదిలో జగన్ 90 శాతం హామీలు అమలు చేశారు. బాబు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది: వాసుపల్లి గణేష్ కుమార్చంద్రబాబు ఒక్కడే ఎప్పుడూ జగన్ను ఢీ కొట్టలేడు. పవన్, బీజేపీని కలుపుకొని బాబు గెలిచాడు. జగన్కు 40 శాతం ఓట్లు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయం. లోకేష్ నాయకుడిగా ఎదగలేడు.. ఆయన నాయకత్వం ముందుకు సాగదు. సంపద సృష్టిస్తా అని అధికారంలోకి వచ్చి.. అప్పు చేసి తల్లికి వందనం ఇచ్చారు. అసెంబ్లీని రబ్బర్ స్టాంప్లా చేస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు అనంతరం జగన్ 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారు. జగన్ మచ్చ లేని నాయకుడు.. ఆయన ఏ తప్పు చేయలేదు. నాయకులు, అధికారుల తప్పిదం వలన ఓడిపోయాం. కూటమి పాలనలో తప్పులు చేసిన వారు ఎక్కడున్నా తీసుకొస్తాం. -
మంత్రి సొంత జిల్లాలోనే ఇలానా.. చేతులెత్తేసిన కూటమి సర్కార్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే దారుణం జరిగింది. మైదుకూరులో పట్టపగలే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తాళం పడింది. నిర్వహణ చేతకాక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తనిఖీకి వెళ్లిన సందర్భంలో తాళం వేసిన ఆసుపత్రి దర్శనమిచ్చింది.వైఎస్ జగన్ హయాంలో మంచి భవనాలు కట్టించి.. సిబ్బంది ఏర్పాటు చేశారు. అన్ని వసతులు సమకూర్చినా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిర్వహించడం చేతకాక తాళం వేశారు. సిబ్బంది తాళం వేసుకుని వెళ్లిపోయారంటూ టీడీపీ ఎమ్మెల్యే సుధాకర్యాదవ్ నానా హంగామా చేశారు. డీఎం అండ్ హెచ్వోకి ఫిర్యాదు చేశారు. వెంటనే సిబ్బందిని సస్పెండ్ చేయాలంటూ హుకుం జారీ చేశారు.సొంత పార్టీ ఎమ్మెల్యే తనిఖీలోనే కూటమి ప్రభుత్వ చేతగానితనం బట్టబయలైంది. కనీసం మండల స్థాయిలో ఉన్న పీహెచ్సీని కూడా నిర్వహించలేని కూటమి సర్కార్ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విఫల మంత్రి అంటూ కామెంట్లు పెడుతున్నారు -
‘సూపర్ సిక్స్ కాదు.. ఫస్ట్ బాల్కే కూటమి ఔట్’
సాక్షి, హైదరాబాద్: తల్లికి వందనం పేరుతో కూటమి సర్కార్ మహా మోసం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. మీకు 15వేలు, మీకు 18వేలు ఇస్తామని ఎన్నికల ముందు బీరాలు పలికి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక్కటే ఇచ్చి చేతులు దులుపుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు.వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతున్నారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామన్నారు, ఏమైంది?. తల్లికి వందనం పేరుతో కూటమి సర్కార్ మహా మోసం చేస్తోంది. రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా?.మీకు 15వేలు, మీకు 18వేలు ఇస్తామని ఎన్నికల ముందు బీరాలు పలికారు. మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక్కటే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామన్నారు.. ఏమైంది?. మహిళలకు ఉచిత బస్సు ఇంకా ఎప్పుడు ఇస్తారు?. అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న రూ.20వేలు ఎక్కడ?. రాష్ట్రంలో దాదాపు 88 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇవ్వాలి. సవాలక్ష ఆంక్షలతో పిల్లల సంఖ్య 66 లక్షలకు తగ్గించే కుట్ర చేస్తున్నారు. రాష్ట్ర ఖనిజ సంపదను రూ.9 వేల కోట్లకు తాకట్టు పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్లో జరిగే కార్యక్రమాలు జరగడం లేదని ప్రజలు అంటున్నారు. సూపర్ సిక్స్ ఏమో కానీ.. ఫస్ట్ బాల్కే కూటమి ఔట్ అని సెటైర్లు వేశారు. ప్రశ్నలు చంద్రబాబుకు నచ్చవు.. ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకు ఇష్టం ఉండదు. అది ప్రజలు అయినా ప్రతిపక్షం అయినా సరే. ఆర్థికశాఖ మీరే రివ్యూ చేస్తే మరి ఆర్థికశాఖ మంత్రి ఏం చేస్తున్నారు. ఏపీఎండీసీని శాశ్వతంగా తాకట్టు పెట్టారు. ఎన్నికల ముందు ఇంటి ఇంటికి వెళ్లి అబద్దాలు చెప్పారు. అధికారం లోకి వస్తే ఒకటికి నాలుగురెట్లు హామీలు ఇస్తామన్నారు. ఇప్పుడిపుడే ప్రజలకు మొత్తం అర్ధం అవుతుంది. మీరు చెప్పింది చేయక పోతేనే ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది.ఇప్పుడు శ్రీలంక కావడం లేదా?మా హయాంలో ఒక పథకం ఒకరోజు ఆలస్యం అయితే మీడియా హడావుడి చేసింది. మరి ఇప్పుడు ఏమైంది ఒక్కరూ ప్రశ్నించరు. ఇప్పుడు మీరు మాకంటే ఎక్కువ అప్పులు చేస్తుంటే శ్రీలంక అవడం లేదా?. సంక్షేమ పథకాల్లో పీపీపీ కాన్సెప్ట్ ఏంటో అర్ధం కావట్లేదు. పథకాల పేర్లు అయితే బాగుంటాయి. కానీ ఒక్కటి నెరవేరదు. టీడీపీకి పునాది సినిమా ఫీల్డ్ అందుకే పథకాల పేర్లు బాగుంటాయి. యువగలం పేరుతో యువకులను మోసం చేశారు. 20 లక్షల మంది యువకులను మోసం చేశారు. పోయిన బడ్జెట్లో సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయించినట్లు ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. మరి ప్రజలకు ఇచ్చారా?. ఆస్తి పోయినా ఆరోగ్యం పోయిన సంపాదించుకోవచ్చు. చంద్రబాబు ప్రతీసారి మోసాలతో క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు. బడ్జెట్ బుక్కులో ఎంత అప్పు ఉందనే సమాచారం కూడా పెట్టలేదు. ప్రశ్నిస్తాన్న వ్యక్తి ఎక్కడ?మేము ఎం చేస్తామో అది చెప్తాం. మీరేమో ఇవ్వబోతున్నాం.. రాబోతుంది అని చెబుతారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి మరీ మేము.. ప్రతి నెల ఒక పథకం అమలు చేశాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినపుడే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పారు. మాకంటే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయా?. కరోనా కూడా ఏమి లేదు కదా. మీ బడ్జెట్కు మా బడ్జెట్కు తేడా 10వేల కోట్లే. కానీ మీ డబ్బంతా ఎటు పోయింది?. ఒక్క సంక్షేమం అమలు చేయలేదు. ప్రశ్నిస్తా అన్న వ్యక్తి ఎటు పోయాడు.బయట వ్యాపారం జరగడం లేదు. సాయంత్రం 7 గంటలకే షాపులు అన్ని బంద్ అవుతున్నాయి. రాత్రి అయినా కూడా వెలుగులతో నడిచేది వైన్ షాప్ మాత్రమే. ఏపీ లో ప్రజలు మల్లి అప్పుల్లో మునుగుతున్నారు. మళ్లీ కాల్ మనీ వ్యవహారం జరుగుతుంది. వ్యాపారాలు లేక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. సంపద సృష్టిలో వైఎస్సార్సీపీ హయంలో చివరి ఏడాది పది శాతం సంపద పెంచాం. మీరు మూడు శాతం పెంచారు. మరి ఎవరిది సంపద సృష్టి. అప్పు మాత్రం 30 శాతం పెంచారు. జీఎస్టీ వసూళ్ళలో కూడా 24 శాతం తగ్గింది. కానీ, చరిత్రలో అత్యధిక జీఎస్టీ వసూలు అని అబద్దాలు చెప్తున్నారు.ఉద్యోగులకు మోసం.. ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం అడ్డంగా మోసం చేసింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ను వాడుకుంది. రాష్ట్ర విభజన జరిగినపుడు పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్లో 2014 ఏడాదికి 32,990 కోట్లు ఉండగా అందులో ఆంధ్ర భాగం 19,130 కోట్లు దక్కింది. దాన్ని కాస్త చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేసరికి అది 76,516 కోట్లకి పెంచారు. మా ప్రభుత్వం దిగిపోయేసరికి దాన్ని 76,038 కోట్లకు తగ్గించాం. 478 కోట్లు మేము తిరిగి ఉద్యోగులకు కట్టేశాం. ఇది ఉద్యోగులు బాగా గమనించాలి. దాదాపు 57వేల కోట్లు ఉద్యోగుల డబ్బులు వాడుకుంది బాబు ప్రభుత్వం.సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు.. ఎంతోమంది ప్రముఖ జర్నలిస్టులు వారి అభిప్రాయం తెలియజేస్తారు. కానీ, కొమ్మినేని మీద అంత ద్వేషం ఎందుకు?. ఆయన వయసు చూసైనా బాధ అనిపించలేదా?. మీ కోపాన్ని జర్నలిస్టుల మీద చూపిస్తారా?. జర్నలిస్టుకు ఉండాల్సిన హక్కులు కాపాడాలని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రజా పరిపాలన చేయండి.. అంతేకానీ.. కోపం, ద్వేషంతో కూటమి పాలన నడుస్తోంది. మీటింగ్స్ పెట్టి మరి వైఎస్సార్సీపీ ఓటు వేస్తే పథకాలు ఇవ్వద్దని చెప్పడం అన్యాయం. మీరు ఒక్క పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రి కాదు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబూ.. అంత మోసమా: పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: చంద్రబాబు ప్రభుత్వం మామిడి రైతులను నిలువునా మోసం చేస్తోందని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంటనే మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కువ పంట వచ్చిన నేపథ్యంలో తక్కువ ధరకు జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం 8 రూపాయలు కిలో కొనుగోలు చేయమని చెప్తే 4 రూపాయలకే కొనుగోలు చేస్తూ మోసం చేస్తున్నారు’’ అని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.ఉద్యానవన శాఖ అధికారులు పర్యవేక్షణ లేకుండా రైతులను ఎలా గిట్టుబాటు ధర కల్పిస్తారు?. జ్యూస్ ఫ్యాక్టరీలు వద్ద 100 టోకెన్లు వాళ్లకు కావాల్సిన వాళ్ళకే ఇచ్చి, మిగిలిన రైతులకు అన్యాయం చేస్తున్నారు. రాష్ట్రంలో మామిడి రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కిలో 15 రూపాయలు యావరేజ్కు మామిడి కొనుగోలు చేశారు. గత మూడేళ్లుగా దాదాపు రూ.22 రూపాయలు గిట్టుబాటు ధర పలికింది. ఇప్పుడు మరి దారుణంగా చంద్రబాబు పాలనలో కిలో 4 రూపాయలకు ఫ్యాక్టరీలు కొనుగోలు చేసి మోసం చేస్తున్నారు.ఏలూరు జిల్లా, నూజివీడు, కృష్ణా జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పొదిలిలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా రైతులపై కేసులు పెట్టారు. ఏ పంటకు మీ ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తున్నారో చెప్పాలి. చంద్రబాబు పాలనలో రైతులు గురించి పట్టించుకున్నది ఎన్నడు లేదు. వ్యవసాయం చేయడం దండగ అని చంద్రబాబే అన్నారు’’ అని పెద్దిరెడ్డి గుర్తు చేశారు.ఏ ఫ్యాక్టరీలో 4 రూపాయలకు మించి కొనుగోలు చేయడం లేదు జీడి నెల్లూరులో రైతులు ఆందోళన చేశారు. రైతులు సరైన వివరాలు లేకుండా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మామిడి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ తరపున డిమాండ్ చేస్తున్నా.. రాష్ట్ర వ్యాపారంగా ఉన్న మామిడి రైతులను గిట్టుబాటు ధర 8 రూపాయలు కల్పించి ఆదుకోవాలి’’ అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. -
రెచ్చిపోయిన జనసేన ఎమ్మెల్యే..
రాజానగరం: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఓ కార్యకర్తపై పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. చెరువుల తవ్వకం విషయమై తన వద్దకు వచ్చిన ఒక కార్యకర్తపై ఎమ్మెల్యే బలరామకృష్ణ తీవ్రస్థాయిలో దుర్భాలాడారు.ఈ ఘటనను అదే పార్టీకి చెందిన మరో కార్యకర్త తన సెల్ఫోన్లో రికార్డు చేసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ‘జన సైనికుడిపై జనసేన ఎమ్మెల్యే బూతు పురాణం’ పేరిట ఆ ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘నువ్వెంత పోటుగాడివిరా.. ఎక్కువ మాట్లాడకు.. నువ్వెందుకు దెం.. దెం.. యి,’ వంటి బూతులతో పాటు ఇంకా ఘాటైన పదాలతో దూషించినట్లు ఆడియో ఉంది.నీతి, న్యాయం, ధర్మం గురించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కళ్యాణ్ తెగనీతులు చెబుతుంటారని.. ఇప్పుడు బూతులతో రెచ్చిపోయిన తన పార్టీ ఎమ్మెల్యేపై ఆయన ఇప్పుడేమంటారని పలువురు ఘాటువ్యాఖ్యలు చేస్తున్నారు. -
ఉద్రిక్తత.. తలారి రంగయ్య పాదయాత్రకు టీడీపీ అడ్డంకులు
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో సేవ్ ఆర్డీటీ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కళ్యాణ దుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. బాల వెంకటాపురం గ్రామంలో పాదయాత్ర చేయొద్దంటూ పోలీసులు హుకుం జారీ చేశారు.బాల వెంకటాపురంలో రాత్రికి రాత్రే టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఫ్లెక్సీలు వెలిశాయి. వైఎస్సార్సీపీ నేతల అల్పాహార శిబిరాన్ని పోలీసులు తొలగించారు. పోలీసుల తీరుపై మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నిస్వార్థ సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) కి విదేశీ నిధులు ఆపొద్దని కోరుతూ 16 రోజులుగా మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.