మహిళపై కత్తులతో దాడి, పరిస్థితి విషమం! | Chittoor: Land Dispute Opponents Attack On Woman With Knives | Sakshi
Sakshi News home page

మహిళపై కత్తులతో దాడి, పరిస్థితి విషమం!

Aug 10 2020 3:43 PM | Updated on Mar 21 2024 8:24 PM

సాక్షి, చిత్తూరు: ఆస్తి తగాదాల విషయంలో ఓ మహిళపై సమీప బంధువులు విచక్షణారహితంగా దాడి చేశారు. చిత్తూరు జిల్లా కెవి పల్లె మండలం పాపిరెడ్డిగారి పల్లెలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యర్థులైన సమీప బంధువులు కత్తులతో తెగబడటంతో తులసి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తులసి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తులసి రక్తపు మడుగులో పడి ఉన్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇది పథకం ప్రకారం జరిగిన దాడి అని తులసి భర్త అశోక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ‘నన్ను నా భార్యను చంపడానికి పథకం ప్రకారం దాడి చేశారు’  అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement