ఏ నిమిషానికి.. ఏమి జరుగునో! | krishnaiah reveals about nayeem | Sakshi
Sakshi News home page

Sep 17 2016 9:25 AM | Updated on Mar 21 2024 6:45 PM

టీఆర్‌ఎస్ రాజకీయం గ్యాంగ్‌స్టర్ నయీమ్ డైరీ చుట్టూ తిరుగుతోంది. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత అతడి ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీ సంచలనాత్మకంగా మారింది. వాస్తవానికి డైరీలోని వివరాలను ప్రభుత్వం ఇప్పటిదాకా బయటపెట్టలేదు. బ్రహ్మ పదార్థంలా మారిన ఈ డైరీ ఇప్పుడు అధికార టీఆర్‌ఎస్ నేతల్లోనూ గుబులు రేపుతోంది. నయీమ్ నేర సామ్రాజ్య విస్తరణలో, డబ్బుల సంపాదన దందాలో అతడికి కీలక అనుచరులుగా ఉన్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. వారు పోలీసుల విచారణలో సంచలనాత్మక విషయాలు బయటపెట్టారని సమాచారం. ఇందులో టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన నాయకులతోపాటు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో వివిధ పదవుల్లో ఉన్న వారి బాగోతాలూ బయట పడ్డాయంటున్నారు. ‘‘నయీమ్‌తో లింకులు ఉన్న వారు ఏ పార్టీకి చెందిన వారైనా, చివరకు టీఆర్‌ఎస్ నేతలైనా ఉపేక్షించొద్దు..’’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పోలీసులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్న సమాచారంతో గులాబీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఏదో ఒక రూపంలో నయీమ్‌తో సంబంధాలు నెరిపిన కొందరు టీఆర్‌ఎస్ నేతలు హడలిపోతున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement