చిట్టీలు, అప్పుల పేరుతో జనం నుంచి రూ. 2.50 కోట్ల మేర వసూలు చేసి పరారయ్యాడు ఓ వ్యాపారి. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన రాకుల మల్లేశ్ గత పదేళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్నాడు. అందరితోనూ ఎంతో నమ్మకంగా ఉంటూ వస్తున్నాడు.