ఆంధ్రప్రదేశ్లో పార్టీని విస్తరించేందుకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా విజయవాడలో నిర్వహించిన సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అమిత్ షా కంటే ముందుగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఆ సమయంలో ఒక్కసారిగా కొంతమంది కార్యకర్తలు లేచి.. ''లీవ్ టీడీపీ, ఓన్లీ బీజేపీ'' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.