మా ఫోన్ల వాడకం ఆపండి..! | Sakshi
Sakshi News home page

మా ఫోన్ల వాడకం ఆపండి..!

Published Sun, Sep 11 2016 6:45 AM

దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం, ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ శాంసంగ్ వినియెగదారులకు క్షమాపణలు చెప్పింది. శాంసంగ్ జెంబో స్మార్ట్ ఫోన్ గెలాక్సీ నోట్ 7 వాడకం పై శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. బ్యాటరీ పేలుతున్న ఘటనలతో ప్రపంచవ్యాప్తంగా 2.5 మిలియన్ల ఫోన్లను రీకాల్ చేస్తున్న సంస్థ చివరికి తమ గెలాక్సీ నోట్ 7 ఫోన్ల వాడకాన్ని నిలిపివేయాలని ప్రకటించింది.