ఆయిల్‌పామ్‌ సాగు ఎంతో శ్రేయస్కరం | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ సాగు ఎంతో శ్రేయస్కరం

Jul 24 2026 11:39 AM | Updated on Jul 24 2026 11:39 AM

మోటకొండూర్‌ : ఎల్‌నినో ప్రభావంతో రైతులు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ సాగు చేయడం ఎంతో శ్రేయస్కరం అని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి స్రవంతి సూచించారు. బుధవారం మోటకొండూర్‌లోని రైతు పద్మారెడ్డి ఆయిల్‌ పామ్‌తోటను సందర్శించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎకరం వరి సాగుకు ఉపయోగించే నీటితో 5 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ పి. ప్రవీణ్‌రెడ్డి, పద్మారెడ్డి, అంజిరెడ్డి, పన్నాల ప్రతాప్‌రెడ్డి, వెంకటేష్‌, నోముల నర్సిరెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement