జంగారెడ్డిగూడెం: చోరీకి గురై మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, వాటిని నేరుగా బాధితుల ఇళ్లకే వెళ్లి అందజేశారు జంగారెడ్డిగూడెం పోలీసులు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, ఇన్స్పెక్టర్ ఎం.వి.సుభాష్ ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ ఎన్.వీరప్రసాద్, కె.సోమరాజు గత నెల రోజుల్లో రికవరీ చేసిన సుమారు రూ.5,75,000 విలువైన 28 మొబైల్ ఫోన్లను బాధితుల ఇళ్లకు వెళ్లి స్వయంగా అందజేశారు. మరోసారి జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో మొబైల్ ఫోన్లను రికవరీ చేసినందుకు జంగారెడ్డిగూడెం పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.


