కాళ్ల: మండలంలోని కాళ్లకూరులో ఉన్న స్వయంభూః శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మాడవీధుల విస్తరణకు భక్తులు విరాళం అందించినట్లు దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈఓ మోకా అరుణ్ కుమార్ ఆదివారం తెలిపారు. దొడ్డనపూడి గ్రామానికి చెందిన ఆరేటి సర్వేశ్వరరావు–జానకమ్మల జ్ఞాపకార్థం వారి కుమారులు వీవీ సత్యనారాయణ–కృష్ణకుమారి, వెంకటేశ్వరరావు–సత్యవతి, రంగారావు–వెంకటరత్నం దంపతులు రూ.1,11,600 అందించినట్లు వివరించారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి ప్రతిమతో సత్కరించారు.


