జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం ఆలయ ప్రాకార మండపంలో అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. శనివారం సాయంత్రం వరకు వివిధ సేవల రూపేణా ఆలయానికి రూ. 2,08,267 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఆలయంలో జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాజాన సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. కాగా, నిత్యాన్నదాన సత్రంలో సుమారు 1,897 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ రాజాన సత్యనారాయణ, ఈవో ఆర్.వి.చందన పేర్కొన్నారు.


