రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
సంగెం: రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతిలో పంటలు సాగుచేస్తే లాభాలు గడించవచ్చని కలెక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చింతలపల్లిలో గురువారం నిర్వహించిన గ్రామసభ ఆమె మాట్లాడారు. రైతులు పంట మార్పిడి విధానాలను అనుసరిస్తే అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం ఉన్నందున తక్కువ నీటితో సాగు చేసే పంటలు వేయాలని సూచించారు. ఆడపిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. ఈ ఏడాది పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన వారి సంఖ్య పెరగడం అభినందనీమన్నారు. అనంతరం ఉపాధి కూలీలతో మాట్లాడారు. గవిచర్లలో జరిగిన గ్రామ సభలో సర్పంచ్ బాషిపాక సదయ్య, పశుసంవర్థకశాఖ జేడీ బాలకృష్ణ, మండల ప్రత్యేకాధికారి రమేశ్ తహసీల్దార్ రాజ్కుమార్ పాల్గొన్నారు.
1,39,356
1,20,880
60,616
56,097
46,165
42,836
97,660
92,626
1,37,821
1,22,591
హనుమకొండ
జనగామ
వరంగల్
భూపాలపల్లి
ములుగు


