కొత్తకోట వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో వరలక్ష్మి వ్రతంతో పాల్గొన్న మహిళలు
శ్రావణమాసం శుక్రవారాన్ని పురస్కరించుకొని శ్రీరంగాపురం శ్రీ రంగనాథస్వామి, పెబ్బేరు అయ్యప్పస్వామి, కొత్తకోటలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆయా ఆలయాల ఆవరణలో నిర్వాహకులు ప్రత్యేక
మండపాలను ఏర్పాటుచేయగా.. అర్చకులు అమ్మవారిని అందంగా అలంకరించి వేద మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు, వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. – కొత్తకోట/వనపర్తి రూరల్


